
క్లబ్బుతో
గెస్టులతో పేకాట నిర్వహణ ● కేసులు లేకుండా చూసుకుంటానని హామీ ● నెలవారీ మాముళ్లు ఇవ్వాలని డిమాండ్ ● కూటమి ఎమ్మెల్యే బరితెగింపు ● కొద్దిరోజుల క్రితం క్లబ్బుపై టాస్క్ఫోర్స్ దాడి ● కేసులు పెట్టకుండా విడిపించిన సదరు ఎమ్మెల్యే ● వాటాల వ్యవహారం తేలిన వెంటనే ప్రారంభించేందుకు సన్నాహాలు
8లో
బుధవారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2025
ప్రశాంతంగా డిప్లొమా లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్ష
మురళీనగర్: ఇండస్ట్రియల్ ట్రైనింగ్ (ఐటీఐ) పూర్తి చేసి బ్రిడ్జి కోర్సు చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ పరీక్ష కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మంగళవారం ప్రశాంతంగా జరిగింది. ఉత్తరాంధ్రలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో కోర్సు పూర్తి చేసిన 145 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ర్యాంకుల ఆధారంగా డిప్లొమా రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తామని పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నారాయణరావు తెలిపారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
క్లబ్బుతో గలీజు ఆటను ప్రారంభించారు ఓ కూటమి ఎమ్మెల్యే. విశాఖ నగరంలో ఎంతో చరిత్ర ఉన్న పాత క్లబ్బులో పేకాటను నిర్వహించుకునేందుకు అండదండలు అందించేందుకు ముందుకొచ్చారు. ఇందుకుగానూ తన మనుషులకు క్లబ్బులో పేకాటాడేందుకు అనుమతితో పాటు నెలవారీ మామూళ్లు ఎంత ఇస్తారో తేల్చాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం క్లబ్బులో పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించగా.. కేసులు పెట్టకుండా సదరు ఎమ్మెల్యేనే విడిపించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా తాను చూసుకుంటానని.. ఇందుకోసం మాముళ్లు ఎంత మొత్తం ఇస్తారో నిర్ణయించుకోవాలని ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాటాల వ్యవహారం తేలకపోవడంతో తాత్కాలికంగా పేకాట నిలిచినప్పటికీ త్వరలో భారీగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిబంధనల మేరకు 50 మంది సీనియర్ సభ్యులు మాత్రమే పేకాట ఆడుకునేందుకు అవకాశం ఉన్న సదరు క్లబ్బులో మరో 200 మందిని గెస్టుల రూపంలో ఆడేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే క్లబ్బులో బార్ నిర్వహణను తన మనిషికి ఇప్పించుకున్న ఎమ్మెల్యే.. మొత్తం క్లబ్నే తన ఆధీనంలోకి తీసుకునేలా పథక రచన చేస్తున్నట్టు సమాచారం.
గెస్టుల రూపంలో..!
నిబంధనల మేరకు క్లబ్బులో సభ్యత్వం ఉన్న అత్యంత సీనియర్లు మాత్రమే పేకాట ఆడుకునేందుకు అవకాశం ఉంది. ఈ సంఖ్య సదరు క్లబ్బులో 50 మందికి మించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే క్లబ్బుతో ఎలాంటి సంబంధం లేని 200 మంది వరకూ తన అనుచరులతోపాటు బయటి వ్యక్తులు గెస్టులుగా వచ్చి ప్రతీ రోజూ పేకాట ఆడుకునేందుకు అవకాశం కల్పించాలని సదరు కూటమి ఎమ్మెల్యే కోరుతున్నారు. అంతేకాకుండా వారి నుంచి రోజుకు ఇంత మొత్తం వసూలు చేసుకోవాలంటూ క్లబ్బు యాజమాన్యానికి సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి సదరు క్లబ్బులో అప్పటికే సీనియర్ సభ్యులు కానీ వారు కూడా పేకాటాడుతున్న వ్యవహారంపై కొద్దిరోజుల క్రితం నేరుగా కొందరు పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసు సిబ్బందితో పాటు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి కొద్ది మందిని స్టేషన్కు తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే సదరు ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొచ్చి ఎటువంటి కేసులు నమోదు కాకుండా వారిని పోలీసు స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే గత మూడు రోజులుగా నిలిచిన పేకాట వ్యవహారాన్ని తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నెలవారీగా తనకు ఇంత మొత్తం ముట్టచెప్పేలా క్లబ్బు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం తేలిన అనంతరం క్లబ్బు పేకాటతో కళకళలాడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
న్యూస్రీల్
గెస్టులతో పేకాట నిర్వహణ
కేసులు లేకుండా చూసుకుంటానని హామీ
నెలవారీ మామూళ్లు ఇవ్వాలని డిమాండ్
కూటమి ఎమ్మెల్యే బరితెగింపు
కొద్దిరోజుల క్రితం క్లబ్బుపై టాస్క్ఫోర్స్ దాడి
కేసులు పెట్టకుండా విడిపించిన సదరు ఎమ్మెల్యే
వాటాల వ్యవహారం తేలిన వెంటనే ప్రారంభించేందుకు సన్నాహాలు

క్లబ్బుతో

క్లబ్బుతో