
ప్రత్యేక తరగతులు పరిశీలించిన డీఈవో
గోపాలపట్నం: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతులకు హాజరైన విద్యార్థులను ఆయన పలు ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. పాఠశాలలో ఉన్న సదుపాయాలు, తరగతుల నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి, చదివే విధానం గురించి వివరించారు. పరీక్షలు రాసే మెలకువలను తెలియజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరును పెంచాలని సూచించారు.