
శ్రీవిశ్వ విజయభేరి
సీతంపేట: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీవిశ్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని సంస్థ చైర్మన్ కె.ధర్మరాజు, డైరెక్టర్ పి.సూర్యనారాయణ తెలిపారు. వివిధ కేటగిరీల్లో బి.నవదీప్ రాజు 31వ ర్యాంకు, ఎ.తారక్రామ్ 151, ఎల్.హరికేష్ 519, సిహెచ్.వెంకట హేమవర్ధన్ 592, కె.బలరామ్ 706, బి.షణ్ముఖనాయుడు 765, యు.జయంత్కుమార్ 953, వై.రాజశేఖర్ 1522, డి.రవిరాజు 1917, పి.నితీష్ కుమార్ 2,396 ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. మొత్తంగా వెయ్యి లోపు ఏడుగురు, 5వేల లోపు 30 మంది, పదివేల లోపు 52 మంది ర్యాంకులు సాధించారన్నారు.