
ఉద్యోగ విరమణ శేష జీవితానికి పునాది
అల్లిపురం: జీవీఎంసీలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందడం ప్రతి ఉద్యోగికి తప్పనిసరని, ఇది శేష జీవితానికి పునాది లాంటిదని జీవీఎంసీ అదనపు కమిషనర్ బి.వి.రమణమూర్తి అన్నారు. జీవీఎంసీలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఏడుగురు ఉద్యోగులను అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, డీపీవో ఫణిరామ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పద్మజతో కలిసి ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన ప్రతి ఉద్యోగి తమ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలన్నారు. ఆరోగ్యం కోసం ఏదో పని కల్పించుకోవాలని సూచించారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రూ.65,47,310 ప్రావిడెంట్ ఫండ్ను అందజేశారు. ఏపీడబ్ల్యూఈఎంఎస్, జేమ్స్ జనరల్ సెక్రటరీ ఎ.అప్పలరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.