
బాధిత కుటుంబాలకు మేయర్ పరామర్శ
అల్లిపురం: సింహగిరిపై గోడ కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను మేయర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్ గంగారావు బుధవారం పరామర్శించారు. కేజీహెచ్ మార్చురీ వద్ద బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ వెంటనే స్పందించి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను అప్రమత్తం చేశారని మేయర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాతో పాటు ఒకరికి ఉద్యో గం ప్రకటించారని పేర్కొన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేశారని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు.