
కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి
బొంరాస్పేట: పేదల సొంతింటి కల కాంగ్రెస్తోనే సాకారమవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని బాపన్చెరువుతండా పంచాయతీ పరిధిలోని బీక్యానాయక్ తండాలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఇంటి నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాజేశ్రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నర్సింలుగౌడ్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు దాసరి చంద్రప్ప, పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, అంజిల్రెడ్డి, రాంచంద్రారెడ్డి, గుండప్ప, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, గోపాల్, చిన్న నర్సింలు, సాయిలు, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
వ్యసనాలకు దూరంగా ఉండాలి
ఎస్ఐ అబ్దుల్ రవూఫ్
బొంరాస్పేట: యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని బొట్లోనిగూడ తండా గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్రకృతి కాపాడాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సిట్ విచారణకు హాజరు
తాండూరు: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పలువురు స్థానిక వ్యక్తులు సిట్ విచారణకు హాజరవుతున్నారు. సోమవారం నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణకు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు నర్సిరెడ్డి హాజరయ్యారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేత డాక్టర్ సంపత్కుమార్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. 2023 నవంబర్ 15నుంచి 30 వరకు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు చెప్పారన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న నర్సిరెడ్డి ఫోన్ను ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందనే అంశంపై సిట్ అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం.
రీల్స్ కోసం
బైక్పై ప్రమాదకర స్టంట్
రాజేంద్రనగర్: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది యువకులు ఓ ఎలక్ట్రి క్ ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి రీల్స్ కోసం స్టంట్ చేశారు. జాతీయ రహదారిపై ఈ స్టంట్ కొనసాగుతుండటంతో ఈ మర్గంలో వెళ్తున్న వారు తమ సెల్ఫోన్లో బంధించి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో ఇలాంటి స్టంట్ అర్ధరాత్రి వేళ జరుగుతుండటంతో పలువురు తమ ఎక్స్ వేదికల ద్వారా దీనిని సైబరాబాద్ పోలీసుల దృష్టి కి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకొని ఆర్జీఐ పోలీసు లకు అప్పగించారు. పట్టుబడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉండటం గమనార్హం. రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపిన ప్రకారం... ఈ నెల 21న అర్థరాత్రి 1.30 గంటల సమయంలో శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఎని మిది మంది యువకులు బైక్పై శంషాబాద్ నుంచి ఆరాంఘర్ వైపు పయనమయ్యారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు మైనర్లతో పాటు ఐదుగురు యువకులు పయనిస్తూ రీల్స్ చేశా రు. ప్రమాదభరితంగా ఈ జాతీయ రహదారిపై స్టంట్ నిర్వహించారు. ఈ దృశ్యాలను అటుగా వెళుతున్న పలువురు చిత్రీకరించి ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వెళ్లే ఈ రహదారి రాత్రి సమయాల్లో బిజీగా ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో వీఐపీల రాకపోకలతో అలర్ట్గా ఉంటుంది. ఈ స్టంట్ విషయమై పలువురు సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను సోమవారం గుర్తించారు. బైక్తో పాటు ఐదుగురు యువకులను, ముగ్గురు మైనర్లను రాజేంద్రనగర్ పోలీసులకు సోమవా రం సాయంత్రం అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం

కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం