
గ్రామ పంచాయతీగా వాల్యానాయక్ తండా
దుద్యాల్: సోమ్లానాయక్ తండా స్థానంలో వాల్యానాయక్ తండాను గ్రామ పంచాయతీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమ్లానాయక్ తండాలో జనాభా తక్కువగా ఉండడంతో వాల్యానాయక్ తండాకు అనుబంధంగా సోమ్లానాయక్ తండా, రక్తమైసమ్మ తండా, కస్న నాయక్ తండా, జీడిగడ్డ తండాలను అనుబంధ గ్రామాలుగా కలిపారు. ఈ మేరకు వాల్యానాయక్ తండా వాసులు ఎంపీడీఓ మహేశ్కుమార్, ఎంపీఓ సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. అనతరం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా వాసులు రవీందర్ నాయక్, హన్మంత్ నాయక్, వెంకట్ నాయక్, శ్రీనివాస్ నాయక్, అంబర్ సింగ్, శంకర్ నాయక్, మోహన్ నాయక్ పాలొన్నారు.