దుండగులపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

దుండగులపై చర్యలు తీసుకోవాలి

Jun 24 2025 7:34 AM | Updated on Jun 24 2025 7:34 AM

దుండగులపై చర్యలు తీసుకోవాలి

దుండగులపై చర్యలు తీసుకోవాలి

పరిగి: కుల్కచర్ల మండలం పుట్టపహాడ్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే దేశ ద్రోహుల కిందే లెక్కగట్టాలన్నారు. పేదలు, దేశాభ్యున్నతికి పాటుపడిన మహనీయుడికి అవమానం జరగడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య, వెంకటయ్య, ప్రశాంత్‌, రాము, ప్రభు, బాలరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

అఖిలపక్ష నాయకుల ఆందోళన

కుల్కచర్ల: మండల పరిధిలోని పుట్టపహాడ్‌లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నేతలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా బీజేపీ మండల నాయకులు పుట్టపహాడ్‌ నుంచి కుల్కచర్ల వరకు నిరసన పాదయాత్ర చేపట్టారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. మహనీయుడి విగ్రహంపై దాడి హేయనీయం అన్నారు. వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ మొగులయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రహ్లాదరావు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మాజీ ఎంపీపీ సత్యమ్మ, బ్లాక్‌ బి అధ్యక్షుడు భరత్‌కుమార్‌, ఏఐసీసీ నాయకులు రాములు, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

కఠినంగా శిక్షించాలి

అనంతగిరి: కుల్కచర్ల మండలం పుట్టపహాడ్‌లో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పలువురు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, ఎస్పీ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. విగ్రహ ధ్వంసం చేసిన సంఘం విద్రోహ శక్తులను ప్రోత్సహించే వ్యక్తులను, వ్యవస్థను రూపుమాపాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠింనంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రాములు, మొగులయ్య, శ్రీనివాస్‌, వినోద్‌కుమార్‌, భరత్‌కుమార్‌, శ్రీనివా స్‌, వెంకట్‌, బుగ్గన, బుచ్చన్న, నరేందర్‌, రాము లు, వెంకట్‌రాములు, కృష్ణ తదితరులు ఉన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం చేయడం సిగ్గుచేటు

వ్యవసాయ కార్మిక సంఘం

జిల్లా కార్యదర్శి వెంకటయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement