
నీటి గుంతలో పడి మహిళ మృతి
మొయినాబాద్: బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ మహిళ దుస్తులు ఉతకడానికి వెళ్లి నీటి గుంతలో పడి మృతి చెందింది. ఈ సంఘటన మొయినాబాద్లో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం రిబ్బన్పల్లికి చెందిన మంజుల(31) కుటుంబం కొన్నేళ్ల క్రితం మొయినాబాద్కు వలస వచ్చింది. కొంత కాలం క్రితం ఆమె భర్త రవికుమార్ మృతి చెందాడు. ముగ్గురు పిల్లలతో కలిసి సురంగల్ రోడ్డు పక్కన ఓ గుడిసె వెసుకుని నివాసముంటూ కూలీ పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. ఇదిలా ఉండగా ఆదివారం మొయినాబాద్ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పక్కన ఉన్న ఓ నీటి గుంతలో దుస్తులు ఉతికేందుకు వెళ్లింది. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడిపోయింది. సోమవారం అటుగా వెళ్లిన ఓ వ్యక్తి గుంతలో తేలిన శవాన్ని గమనించి, మున్సిపల్ వార్డు అధికారి సుదర్శన్కు సమాచారం అందించాడు. సుదర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గతంలో తండ్రి, ఇప్పుడు తల్లి మరణించడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.