మోదీ పాలనలో దేశం పురోగతి | - | Sakshi
Sakshi News home page

మోదీ పాలనలో దేశం పురోగతి

Jun 24 2025 7:34 AM | Updated on Jun 24 2025 7:34 AM

మోదీ పాలనలో దేశం పురోగతి

మోదీ పాలనలో దేశం పురోగతి

చేవెళ్ల: దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌.రత్నం అన్నారు. స్థానిక కేవీఆర్‌ గ్రౌండ్‌లో సోమవారం చేవెళ్ల మున్సిపాలిటీ బూత్‌స్థాయిలో తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసంఘ్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. మోదీ సారథ్యంలో దేశం ఎంతో పురోగతి సాధించిందన్నారు. తల్లికి వందనంతో దేశంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతీ బూత్‌లో కనీసం 50 మొక్కలు నాటాలని, నియోజకవర్గంలో 25వేల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్వానం పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్‌ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్‌రెడ్డి, యువ నాయకుడు డాక్టర్‌ మల్గారి వైభవ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విఠల్‌రెడ్డి, జిల్లా నాయకులు వెంకట్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, కుంచం శ్రీనివాస్‌, నాయకులు మధుసుధన్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, మధుసుధన్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌.రత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement