
పొలాల వద్ద ఇసుక డంపులు
దోమ: ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ ఆనంద్కుమార్ అన్నారు. సోమవా రం మండల కేంద్రంలోని అనుబంధ గ్రామమైన ఉదన్రావుపల్లికి చెందిన తొమ్మిది మంది రైతులు అక్రమంగా పాలేపల్లి–ఉదన్రావుపల్లి వాగు నుంచి ట్రాక్టర్ల సాయంతో ఇసుక తీసుకువచ్చి పొలాల వద్ద డంపులుగా నిల్వ చేసుకున్నారనే సమాచారం అందిందన్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టి వాటిని సీజ్ చేశామన్నారు. మంగళవారం తహసీల్దార్ గోవిందమ్మ ఎదుట బైండోవర్ చేసి జరిమానా విధిస్తామన్నారు. ఇసుక అవసరమున్న వారు తహసీల్దార్ వద్ద అనుమతులు తీసుకొని ట్రాక్టర్ల సహాయంతో తరలించుకోవాలని సూచించారు. ఈ దాడుల్లో ఆర్ఐ సుదర్శన్, హెడ్ కానిస్టేబుల్ నర్సింలు పాల్గొన్నారు.
సీజ్ చేసిన అధికారులు