మహాసభ సభ్యత్వం తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మహాసభ సభ్యత్వం తీసుకోవాలి

Jun 23 2025 8:43 PM | Updated on Jun 23 2025 8:43 PM

మహాసభ సభ్యత్వం తీసుకోవాలి

మహాసభ సభ్యత్వం తీసుకోవాలి

మున్నూరు కాపు సంఘం తాలూకా నాయకులు

కొడంగల్‌: రాష్ట్ర మహాసభలో కులస్తులందరూ సభ్యత్వం తీసుకోవాలని మున్నూరు కాపు సంఘం తాలూకా అధ్యక్షుడు బాకారం చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి బి.మల్లయ్య కోరారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని కాచిగూడ కార్యాలయానికి మహాసభ అనుబంధంగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని కొడంగల్‌, ఉడిమేశ్వరం, పర్సాపూర్‌, దుద్యాల, అలిఖాన్‌పల్లి, పాత కొడంగల్‌, కొండారెడ్డిపల్లి గ్రామ కమిటీ సభ్యులతో పాటు కొడంగల్‌, దుద్యాల, దౌల్తాబాద్‌ మండల కమిటీలు, యువజన కమిటీలు, మహిళా కమిటీ సభ్యులు రాష్ట్ర మహాసభ సభ్యత్వం తీసుకోవాలన్నారు. ఈనెల 26వ తేదీ వరకు సభ్యత్వం తీసుకోవడానికి నిర్ణయించినట్లు చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు పెద్ది పెంటయ్య, ప్రధాన కార్యదర్శి జైపాల్‌రెడ్డి సూచన మేరకు సభ్యత్వాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కులస్తులందరూ రాష్ట్ర మహాసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం, ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు సిరుసని శ్యాంసుందర్‌, అరిగె ఓం ప్రకాశ్‌, కోశాధికారి కానుకుర్తి నర్సిరెడ్డి, ప్రచార కార్యదర్శి మున్నూరు బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement