పర్యాటక శోభ | - | Sakshi
Sakshi News home page

పర్యాటక శోభ

Jun 23 2025 8:43 PM | Updated on Jun 23 2025 8:43 PM

పర్యాటక శోభ

పర్యాటక శోభ

కోట్‌పల్లి ప్రాజెక్టుకు ఆదివారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎండలు తగ్గడంతో కుటుంబసమేతంగా వచ్చిన సందర్శకులు ప్రాజెక్ట్‌ నీటిలో సందడిగా గడిపారు. యువతీ యువకులు బోటింగ్‌ చేస్తూ సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొట్టారు. – ధారూరు

వికారాబాద్‌: గతంలో ఏడు జిల్లాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 11 జిల్లాలకు విస్తరించింది. ఇందుకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ట్రిపుల్‌ ఆర్‌కు ఐదు కిలో మీటర్ల ఆవలి వరకు హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ పరిధిలోకి మన జిల్లా సైతం వచ్చేసింది. జిల్లా పరిఽధిలోని ఐదు మండలాలకు చెందిన 54 రెవెన్యూ గ్రామాలు, మరో 20కి పైగా అనుబంధ గ్రామాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి చేరుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

జిల్లా సమగ్రాభివృద్ధికి స్పెషల్‌ జీఓ

రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న జిల్లా అభివృద్ధిలో అందరాని దూరంలో నిలిచిపోయింది. నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతూ నెట్టుకొస్తున్న జిల్లాకు ఏకకాలంలో ముఖ్యమంత్రి, స్పీకర్‌ పదవులు వరించాయి. సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి తొలుత కడా(కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటు చేయడంతో అభివృద్ధి సొంత నియోజకవర్గానికే పరిమితం చేస్తారా అంటూ మిగిలిన జిల్లాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక జీఓ 190 విడుదల చేసిన విషయం విదితమే. వుడా(వికారాబాద్‌ అర్భన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) పేరుతో జిల్లాను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

మహానగరం మరింత విస్తరించనుంది. త్వరలో నిర్మించనున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ట్రిపుల్‌ ఆర్‌) ఆవల ఐదు కిలోమీటర్ల వరకు పరిధిని విస్తరించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అభివృద్ధికి ఊపందుకోనుందని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వుడా పరిధిలో 493,హెచ్‌ఎండీఏలో 54 రెవెన్యూ గ్రామాలు

జిల్లా సమగ్రాభివృద్ధికి మార్చిలో స్పెషల్‌ జీఓ 190 విడుదల చేయగా.. కడా పేరిట కొడంగల్‌ నియోజకవర్గంలో రూ.6 వేల కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. తాజా జిల్లాలోని పలు ప్రాంతాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి చేర్చడంతో అభివృద్ధి మరింత ఊపందుకుంటుందని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వుడా పరిధిలోకి నాలుగు మున్సిపాలిటీలు (వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌)తో పాటు, 493 రెవెన్యూ గ్రామాలు రానున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోకి ఐదు మండలాల నుంచి 54 రెవెన్యూ గ్రామాలు, 20 గ్రామాలు చేర్చే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధిలో రాజధాని హైదరాబాద్‌తో పాటు శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల డెవలప్‌మెంట్‌ కీలకం కానుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఏర్పాటు చేసి అభివృద్ధి పనులను వేగిరం చేస్తోంది.

హెచ్‌ఎండీఏ పరిధిలోకి జిల్లా

ఐదు మండలాలు, 54 రెవెన్యూ గ్రామాలు, 20కి పైగా గ్రామాలు

ఒక్క పూడురు నుంచే 23 రెవెన్యూ గ్రామాలు

ఊపందుకోనున్న అభివృద్ధి

హెచ్‌ఎండీఏ పరిధిలోని రెవెన్యూ గ్రామాలు

మండలం రెవెన్యూ గ్రామాలు

అంగడిచిట్టెంపల్లి, చన్గోముల్‌, చీలాపూర్‌, చింతల్‌పల్లి,

కండ్లపల్లి, కంకల్‌, కెరవెళ్లి, కడ్మూర్‌, కొత్తపల్లి, మంచన్‌పల్లి,

మన్నెగూడ, మేడిపల్లి, మిర్జాపూర్‌, మిట్టకంకల్‌,

నిజామ్‌పేట్‌ మేడిపల్లి, పెద్ద ఉమ్మెంతాల్‌,

పూడూరు,కుద్భుల్లాపూర్‌, రేగడిమామిడిపల్లి, పోమన్‌గుర్తి,

తిర్మలాపూర్‌, ఎన్కెపల్లి, తుర్కెన్కెపల్లి

అక్నాపూర్‌, చించల్‌పేట్‌, గంగ్యాడ, గుబ్బడిఫతేపూర్‌,

లింగంపల్లి, మాదిరెడ్డిపల్లి, ముబారక్‌పూర్‌, నవాబుపేట,

పూలపల్లి, పులిమామిడి, ఎల్లకొండ

వికారాబాద్‌(జిల్లా కేంద్రం) బూర్గుపల్లి, ధన్నారం,

గెర్‌గెట్‌పల్లి, గుడుపల్లి, కొంపల్లి, మద్గుల్‌చిట్టెంపల్లి,

పాతూరు, పీరంపల్లి, పులుసుమామిడి,

సిద్దులూరు(చెంచలం), సిద్దులూరు(పాయాగ),

సిద్దులూర్‌ (మునుగాల)

మోమిన్‌పేట చీమల్‌ధరి, చక్రంపల్లి, దేవరంపల్లి

పరిగి చిట్యాల్‌, మాదారం, రాపోల్‌, తొండపల్లి

పూడూరు

నవాబుపేట

వికారాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement