
విద్య మాటున వ్యాపారం
గెట్ల పంచాయితీ! దౌల్తాబాద్కు చెందిన ఓ రైతు ఆరు నెలల క్రితం భూమి కొలత కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు.
8లోu
9లోu
తాండూరు: పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలనే తల్లిదండ్రుల కోరికను ప్రైవేట్ పాఠశాలలు ఆసరాగా చేసుకుంటున్నాయి. తల్లిదండ్రులకు పిల్లలపై ఉన్న ప్రేమ ప్రైవేట్ పాఠశాలలకు కాసుల వర్షం కురిపిస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో న్యూ అడ్మిషన్లు, ఏడాది ఫీజు పేరిటప్రైవేట్ పాఠశాలల యాజమన్యాలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇంతటితో ఆగకుండా పుస్తకాలు తాము చెప్పిన చోటే కొనుగోలు చేయాలని హుకూం జారీ చేస్తున్నారు. ఈ విద్యావ్యాపారాన్ని అరికట్టాలని బీసీ జేఏసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరువయ్యాయరు.
ప్రైవేట్ స్కూళ్లను హెచ్చరించాం
ప్రైవేటు స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదును ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకొన్నారు. దీంతో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించా రు. పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలను విక్రయించి నా, అధిక ఫీజులు వసూలు చేసినట్లు తెలిసినా అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించాం.
– వెంకటయ్యగౌడ్, ఎంఈఓ, తాండూరు
విద్యార్థుల పేరిట దోపిడీ
నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్య, నోట్ పుస్తకాలు విక్రయిస్తున్నారు. పాఠ్య పుస్తకాల ధరలను ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలే నిర్ణయిస్తున్నాయి. విద్యార్థుల పేరిట సాగిస్తున్న ఈ దోపిడీని అరికట్టాలి. ఈ విషయమై ఇప్పటికే విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశాం.
– భాను ప్రసాద్, బీసీ జేఏసీ నాయకుడు, తాండూరు
పాఠ్య, నోట్ పుస్తకాల విక్రయాల్లో ప్రైవేట్ పాఠశాలల మాయాజాలం
తాము సూచించిన చోటే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు చీటీలు
అడ్మిషన్ పేరిట రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు వసూళ్లు
విద్యాశాఖకు ఫిర్యాదు చేసిన బీసీ జేఏసీ సంఘం సభ్యులు
పట్టించుకోని అధికారులు
రూట్ మార్చి విక్రయాలు
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, 20 మండలాలున్నాయి. విద్యాశాఖ వెల్లడించిన ప్రకారం జిల్లా వ్యాప్తంగా 198 ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతుండగా 47,534 మంది విద్యార్థులున్నారు. తాండూరు, కొడంగల్, వికారాబాద్, పరిగి పట్టణాలలో ప్రైవేటు స్కూళ్లు అధికంగా ఉన్నాయి. గతంలో పాఠశాల్లోనే నోట్ పుస్తకాలు, యూనిఫాంలు విక్రయించేవారు. మూడేళ్లుగా విద్యార్థి సంఘాలు, బీసీ జేఏసీ సంఘాలు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో విక్రయాలు నిలిచిపోయాయి. రూట్ మార్చిన యాజమాన్యాలు తాము సూచించిన షాపుల్లోనే పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాంలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. 1వ తరగతి విద్యార్థికి పుస్తకాల సెట్కు రూ.6,500 నుంచి రూ.8 వేల వరకు, 2 నుంచి 10వ తరగతి విద్యార్థుల పుస్తకాల సెట్కు ఒక్కో విద్యార్థికి రూ.7వేల నుంచి రూ.13 వేల వరకు వెచ్చించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. అదే సెట్ ఇతర సెంటర్లలో కొనుగోలు చేస్తే సగం ధరకే వస్తున్నాయని చెబుతున్నారు. యూనిఫాంలు సైతం పాఠశాల యాజమాన్యాలు సూచించిన దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే రూ.5వేల వరకు ఫీజులు పెరిగాయని అడ్మిషన్ ఫీజు రూ.5వేల నుంచి రూ.10 వేలకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్య మాటున వ్యాపారం

విద్య మాటున వ్యాపారం