
అంబేడ్కర్ విగ్రహం ధ్వంసానికి యత్నం
కుల్కచర్ల: మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న వివిధ పార్టీల నేతలు, అంబేడ్కర్ సంఘాల నాయకులు గ్రామానికి చేరుకుని ప్రధాన చౌరస్తాలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహంపై దాడికి యత్నించడం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రమేశ్ తెలిపారు. ఆందోళనలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, బ్లాక్ బి అధ్యక్షుడు భరత్కుమార్, పలువురు నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పరిగి–మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై ఆందోళన