తాండూరులో 296 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

తాండూరులో 296 అర్జీలు

Jun 21 2025 7:19 AM | Updated on Jun 21 2025 7:19 AM

తాండూరులో 296 అర్జీలు

తాండూరులో 296 అర్జీలు

తాండూరు రూరల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. మండలంలో 33 గ్రామాల్లో 14 రోజుల పాటు తహహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ బృందాలుగా ఏర్పడి దరఖాస్తులు స్వీకరించారు. శుక్రవారం ఆఖరు రోజు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పట్టణంలోని పాత తాండూరు, మల్‌రెడ్డిపల్లి, సాయిపూర్‌ ప్రాంతంలోని రైతుల నుంచి అర్జీలు స్వీకరించినట్లు తహసీల్దార్‌ తారాసింగ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 296 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీటీ లలిత, ఆర్‌ఐ గోపి, సిబ్బంది పాల్గొన్నారు.

భూ సమస్యల పరిష్కారానికి..

బంట్వారం: భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కోట్‌పల్లి తహసీల్దార్‌ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం ఎన్నారం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు అందజేసిన 21 దరఖాస్తులను తహసీల్దార్‌ స్వీకరించి పరిశీలించారు. క్షేత్ర స్థా యిలో విచారణ జరిపించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎంసీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

పెద్దేముల్‌లో 205 దరఖాస్తులు

తాండూరు రూరల్‌: పెద్దేముల్‌ మండలంలో రెవెన్యూ సదస్సుల్లో 205 దరఖాస్తులు వచ్చినట్లు డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ చెప్పారు. పెద్దేముల్‌, రుద్రారం గ్రామాల్లో శుక్రవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. 14 రోజుల పాటు ఆయా గ్రామాల్లో తహసీల్దార్‌, డీటీలు రెండు బృందాలు ఏర్పడి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

బొంరాస్‌పేటలో 425

బొంరాస్‌పేట: మండలంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో శుక్రవారం ముగింపునాటికి 425 దరఖాస్తులు వచ్చాయి. ముగింపురోజు మండల పరిధిలోని ఏర్పుమళ్ల గ్రామంలో నిర్వహించిన సదస్సులో 123 దరఖాస్తులు అందాయి. ఇందులో తహసీల్దారు పద్మావతి, ఆర్‌ఐలు శిరీష, రవి, సిబ్బంది ఉన్నారు.

రెవెన్యూ సదస్సులకు స్పందన

కుల్కచర్ల: రెవెన్యూ సదస్సులకు రైతుల నుంచి విశేష స్పందన వచ్చిందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులుముదిరాజ్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని అల్మాస్‌ఖాన్‌పేట్‌లో భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్వహించిన సదస్సులలో 1424 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మనోహర్‌చక్రవర్తి, డీటీ చంద్రశేఖర్‌, గిర్దవరులు ఖాజ, రవి, నాయకులు గోపాల్‌నాయక్‌, శ్రీనివాస్‌, భరత్‌కుమార్‌రెడ్డి, కృష్ణయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.

ముగిసిన రెవెన్యూ సదస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement