
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ వీసీ వీఎల్వీఎస్ఎస్.సుబ్బారావు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు కృషిచేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, లాజిస్టిక్స్ రంగానికి చెందిన కంపెనీలతోపాటు వివిధ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు హాజరయ్యాయరని తెలిపారు. 142 మంది నిరుద్యోగులు వివిధ కంపెనీలకు సంబంధించి ఇంటర్వ్యూలకు హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జె.సుధాకర్, బీఎఫ్ఎస్ఐసీఓఓ సౌమ్యారంజన్, బీఎఫ్ఎస్ఐ ట్రైనర్ శ్రీనాథ్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రఫియాఖానం, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ టి.రాంబాబు, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆర్.శ్రీనివాస్, కళాశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ సుబ్బారావు