
ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ
తాండూరు రూరల్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై మండల పరిధిలోని చెన్గేస్పూర్ గ్రామంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి విచారణ చేపట్టారు. కొన్ని రోజుల క్రితం గ్రామానికి చెందిన ఎరుకల శారద బస్వరాజ్ కుటుంబంపై అదే గ్రామానికి చెందిన రమేశ్గౌడ్, నరేందర్గౌడ్, నానిగౌడ్, నరేష్గౌడ్, పవన్గౌడ్ కులంపేరుతో దూషించి దాడి చేశారని కరన్కోట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం గ్రామానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. డీఎస్పీ సంఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. ఆయన వెంట కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి ఉన్నారు.