
లారీకి లోపం.. వాహనదారులకు శాపం
అనంతగిరి: వికారాబాద్ రైల్వే బ్రిడ్జిపై బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ట్రాఫిక్ జాం అయింది. అటుగా వెళ్తున్న ఓ లారీ సాంకేతికలోపంతో ఆగిపోవడంతో ఒక్కసారిగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేయించారు. కాగా అరగంటకు పైగానే వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తే ట్రాఫిక్ సమస్య ఉండదని స్థానికులు చెబుతున్నారు.
రోడ్డుపై విరిగిపడిన
భారీ వృక్షం
పూడూరు: భారీ వర్షానికి మండలంలోని వికారాబాద్–మన్నెగూడ దారిలో హిట్స్ కాలేజీ సమీపంలో బుధవారం ఓ వృక్షం నెలకొరిగింది. చెట్టు పడిన సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎప్పుడు వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డుపై భారీ చెట్టు పడటంతో గంటకుపైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో వృక్షాన్ని తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
నాణ్యత లేకుంటే సహించం
టేకులగడ్డతండా పాఠశాలకు
జిల్లా సివిల్ సప్లై అధికారులు
బొంరాస్పేట: నాసిరకం భోజనంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ‘సర్కారు బడికి.. నాణ్యత లేని సన్నబియ్యం’ అనే శీర్షికక ప్రచురించిన కథనానికి అధికారుల్లో చలనం వచ్చింది. బుధవారం కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని టేకులగడ్డతండా ప్రాథమిక పాఠశాలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్కృష్ణ, డీఎం మోహన్బాబు, డీసీడీఎం గణపతి, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పరిశీలించారు. ప్రభుత్వం నుంచి సరఫరా అయిన సన్నబియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యంలో పురుగులు కనిపించి అవాక్కయ్యారు. స్థానిక ఎంఈఓ హరిలాల్, హెచ్ఎం గోపాల్ను కారణాలు అడిగి ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నబియ్యం నాణ్యత లేకుంటే సహించేది లేదంటూ హెచ్చరించారు. పాత స్టాక్ కింద మిగిలి ఉన్న సన్నబియ్యాన్ని తిరిగి పంపించాలని సివిల్ సప్లై అధికారులు ఎంఈఓను ఆదేశించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై జూనియర్ అసిస్టింట్ శ్రీనివాస్గౌడ్, సీఆర్పీ సోమ్లా, హెచ్ఎం గోపాల్ ఉన్నారు.
మేకల దొంగలకు రిమాండ్
పూడూరు: మేకల దొంగలను రిమాండ్కు తరలించిన సంఘటన చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుసూదన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పోతిరెడ్డిగూడలో వారం క్రితం మేకలు అపహరణకు గురవడంతో బాధితుడు ఫిర్యాదు చేశాడు. నిఘా పెట్టి విచారణ చేపట్టారు. హైదరాబాద్కు చెందిన ఏకేందర్సింగ్, మహమ్మద్ వాజీద్, షేక్సోహెల్ ముగ్గురు కలిసి కారును అద్దెకు తీసుకుని నగరం చుట్టుపక్కల సంగారెడ్డి, షాద్నగర్, ఆదిబట్ల, చెన్గోముల్ ప్రాంతాల్లో తిరుగుతూ మేకలను కారులో ఎత్తుకెళ్లేవారని తెలిపారు. వాటిని జియాగూడలో విక్రయించి జల్సా చేసేవారు. ఈ క్రమంలో బుధవారం దొంగతనం చేసేందుకు వస్తుండగా మన్నెగూడ చౌరస్తాలో ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానంగా కారులో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. నాలుగు మేకలు, రూ.42వేల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

లారీకి లోపం.. వాహనదారులకు శాపం

లారీకి లోపం.. వాహనదారులకు శాపం

లారీకి లోపం.. వాహనదారులకు శాపం

లారీకి లోపం.. వాహనదారులకు శాపం