
మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యం
● తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి
● మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాతో కలిసి కుట్టు మిషన్ల పంపిణీ
తాండూరు: మహిళ లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకా లు అమలు చేస్తోందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మైనార్టీ కార్పొ రేషన్ చైర్మన్ ఒబేదుల్లా, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేశ్ మహరాజ్తో కలిసి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మైనార్టీ కార్పొరేషన్ నుంచి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు రుణాలు, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాలతో ఆర్థికంగా మేలు చేకూరుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి నాయకులు తదితరులున్నారు.
ఉచితంగా కంది విత్తనాలు
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయనఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు నియోజకవర్గంలోని రైతులకు ఉచిత కంది విత్తనాల పంపిణీచేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంది పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం నాణ్యమైన కంది విత్తనాలను ఉచితంగా అందిస్తోందన్నారు. రైతులు గ్రామాలలోని రైతు వేదికల వద్దకు వెళ్లి విత్తనాలను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సురేందర్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, జెడ్పీటీసీ మాజీసభ్యులు ధారాసింగ్, శ్రీనివాస్రెడ్డి, నాయకులు, రైతులు తదితరులున్నారు.
మహిళలను మహారాణులను చేస్తాం
బషీరాబాద్: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న 70 మంది మహిళలకు ఎమ్మెల్యే కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక పరిపుష్టిని సాధించేలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని తెలిపారు. డ్వాక్రా మహిళలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పాఠశాలల అభివృద్ధి బాధ్యత అప్పగించాలమని గుర్తు చేశారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చి వ్యాపారులుగా తయారు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ అల్పసంఖ్యాక మహిళ శక్తి –రేవంత్ అన్నాకా భరోసా పథకం ద్వారా 18 మంది ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, మాజీ ఎంపీపీ కరుణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్ల జిల్లా అధికారులు బాబుమోజెస్, రాజేశ్వరి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శాంతిభాయి. నాయకులు శంకరప్ప, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మణ్రావు, సురేష్, మాణిక్రావు, సతీష్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.