రెవెన్యూ సదస్సులతో పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సదస్సులతో పరిష్కారం

Jun 19 2025 7:56 AM | Updated on Jun 19 2025 7:56 AM

రెవెన్యూ సదస్సులతో పరిష్కారం

రెవెన్యూ సదస్సులతో పరిష్కారం

నవాబుపేట: రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని చంచల్‌పేట గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఆ తర్వాత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య, నోట్‌ పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ గీతాసింగ్‌నాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంరెడ్డి, తహసీల్దార్‌ బుచ్చయ్య, మాజీ సర్పంచులు రవీందర్‌రెడ్డి, ప్రభాకర్‌, మాజీ ఎంపీటీసీ ఎక్‌బాల్‌, ప్రధానోపాధ్యాయుడు పాండు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement