ఇసుక మాఫియాను కట్టడి చేయండి | - | Sakshi
Sakshi News home page

ఇసుక మాఫియాను కట్టడి చేయండి

Jun 18 2025 7:24 AM | Updated on Jun 18 2025 7:24 AM

ఇసుక మాఫియాను కట్టడి చేయండి

ఇసుక మాఫియాను కట్టడి చేయండి

బీజేపీ నాయకుల వినతి

తాండూరు టౌన్‌: కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పలువురు బీజేపీ నాయకులు తాండూరు సబ్‌–కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ను కోరారు. ఈ మేరకు వారు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతి లేకుండా కాగ్నా నది నుంచి భారీ ఎత్తున ఇసుక తరలిస్తున్నారని చెప్పారు. అడ్డుకున్నవారిపై ఇసుక మాఫియా సభ్యులు దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. సహజసంపదను అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్‌, కార్యదర్శి భద్రేశ్వర్‌, పట్టణాధ్యక్షుడు మల్లేశంమాజీ కౌన్సిలర్‌ లలిత, కృష్ణ, రాజు, సంగమేశ్వర్‌, ప్రకాశ్‌, కిరణ్‌, సతీశ్‌, బాబు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement