‘రైతు నేస్తం’తో కర్షకులకు మేలు | - | Sakshi
Sakshi News home page

‘రైతు నేస్తం’తో కర్షకులకు మేలు

Jun 17 2025 6:59 AM | Updated on Jun 17 2025 6:59 AM

‘రైతు

‘రైతు నేస్తం’తో కర్షకులకు మేలు

దోమ: ౖరెతునేస్తం కార్యక్రమంతో కర్షకులకు మేలు చేకూరుతుందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నాడు. సోమవారం ఆయన మండల పరిధిలోని శివారెడ్డిపల్లి రైతు వేదికలో రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని వీక్షించారు. రైతులు వ్యవసాయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దిగుబడులపై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, ఏడీఏ సౌభాగ్యలక్ష్మి కుమారి, ఎంపీడీఓ గ్యామా, మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

భూమి ఉన్న ప్రతి రైతుకూ రైతు భరోసా

తాండూరు రూరల్‌: భూమి ఉన్న ప్రతి రైతుకూ ప్రభుత్వం రైతు భరోస నిధులు విడుదల చేస్తుందని తాండూరు సబ్‌కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. సోమవారం మండలంలోని అంతారం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సందేశాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి నిబంధనలు లేకుండా పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పట్లోళ్ల బాల్‌రెడ్డి, ఏడీఏ రుద్రమూర్తి, తహసీల్దార్‌ తారాసింగ్‌, ఏవో కొమరయ్య, ఏఈవో తదితరులు పాల్గొన్నారు.

కుల్కచర్ల: వ్యవసాయం పండుగ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నాడని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ఆంజనేయులు ముదిరాజ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కనకం మొగులయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని కుస్మసముద్రం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సాగులో ఎటువంటి అనుమానాలు ఉన్నా ప్రతీ మంగళవారం శాస్త్రవేత్తలో నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో నివృత్తి చేసుకోవచ్చునన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుస్మసముద్రం, కుల్కచర్ల, చౌడాపూర్‌ గ్రామాల్లోని రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయాధికారి వీరస్వామి, ఏఈఓలు బాబు, నిఖిత, కార్యదర్శి జీవామృతం, నాయకులు రాములు, లక్ష్మయ్య, భీమయ్య, కృష్ణయ్య, అంజిలయ్య, కృష్ణారెడ్డి, సాయన్న, ఎల్లయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

సీఎం ప్రసంగాన్ని వీక్షించిన రైతులు

ధారూరు: వ్యవసాయ వర్సిటీలో సోమవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ను అన్ని రైతు వేదికల్లో రైతులు, అధికారులు వీక్షించారు. ధారూరు రైతు వేదికలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ సాజిదాబేగం, రైతులు హాజరైయ్యారు. కేరెళ్లి రైతు వేదికలో నూతనంగా వీడియో కాన్ఫరెన్స్‌ను ఎంపీడీఓ నర్సింలు, ఏఓ సూర్యప్రకాశ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మాన్‌సింగ్‌, ఏఈఓలు సంతోశ్‌, సంజూరాథోడ్‌ పాల్గొన్నారు.

దేవర్‌ఫసల్‌వాద్‌లో..

దౌల్తాబాద్‌: వ్యవసాయ వర్సిటీలో సోమవారం ముఖ్యమంత్రి రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల పరిధిలోని దేవర్‌ఫసల్‌వాద్‌లోని రైతువేదికలో రైతులు వీక్షించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వెంకట్రావు అన్నారు. కార్యక్రమంలో ఏఓ లావణ్య, ఏఈఓలు వైశాలి నాయకులు, రైతులు పాల్గొన్నారు.

రైతు భరోసాపై హర్షం

యాలాల: రైతు భరోసాతో పాటు ప్రభుత్వ పథకాలపై సోమవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని రైతులు వీక్షించారు. మండలంలోని రాస్నం రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల వ్యవసాయ అఽధికారి శ్వేతరాణి, ఏఈఓ శిరీషలు పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. వానకాలం రైతు భరోసా నగదు జమ విషయాన్ని ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్‌ జనార్ధన్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ నర్సింలుగౌడ్‌, నాయకులు ఆరీఫ్‌ హుస్సేన్‌ తదితరులు ఉన్నారు.

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

‘రైతు నేస్తం’తో కర్షకులకు మేలు 1
1/2

‘రైతు నేస్తం’తో కర్షకులకు మేలు

‘రైతు నేస్తం’తో కర్షకులకు మేలు 2
2/2

‘రైతు నేస్తం’తో కర్షకులకు మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement