
ఒకే దరఖాస్తు..!
బొంరాస్పేట: మండలంలోని దుప్చర్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో దరఖాస్తుల కోసం రెవెన్యూ అధికారులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. సాయంత్రం కార్యక్రమం ముగిసే సమయంలో ఒకే దరఖాస్తు వచ్చింది. రెవెన్యూ సదస్సులపై అవగాహన కల్పించకపోవడమా? భూ సమస్యలే లేవా? భూభారతి చట్టంపై అపనమ్మకమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం మండలంలోని సాలిండాపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నారు.
రైతు నేస్తం కార్యక్రమంలో కలెక్టర్
అనంతగిరి: వికారాబాద్ మండలం గొట్టిముక్కుల గ్రామ రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్ కార్యక్రమాన్ని రైతులు, అధికారులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
దాడిచేసిన వారిని
అరెస్ట్ చేయాలి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్
తాండూరు రూరల్: మండల పరిధిలోని చెన్గేస్పూర్లో ఎరుకల కుటుంబంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం గౌతపూర్ సమీపంలోని కరన్కోట్ పోలీస్స్టేషన్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. చెన్గేస్పూర్లో నివాసముంటున్న శారద బస్వరాజ్ కుటుంబంపై అదే గ్రామానికి చెందిన రమేష్గౌడ్, నరేందర్ గౌడ్, నానిగౌడ్, నరేష్గౌడ్, పవన్గౌడ్ దాడి చేశారన్నారు. దాడిచేసిన వారిపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బెల్కటూర్లో దళిత యువకుడిపై దాడి చేసిన ఘటన మరవకముందే చెన్గేస్పూర్లో ఎరుకల కుటుంబంపై దాడి చేయడం దారుణమన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో దళితులు, ఎస్టీలపై దాడులు జరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని శ్రీనివాస్ అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, కృష్ణ, చంద్రప్ప, సాయిలు, శారద, బస్వరాజ్, లక్ష్మి, కిష్టప్ప తదితరులు ఉన్నారు.
మంత్రి శ్రీహరిని కలిసిన ఎమ్మెల్యే బీఎంఆర్
తాండూరు: మంత్రి వాకిటి శ్రీహరిని సోమవారం నగరంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల వాకిటి శ్రీహరి మంత్రి పదవి చేపట్టడంతో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీతోనే తండాల అభివృద్ధి
గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్నాయక్
కడ్తాల్: బీజేపీతోనే గిరిజన తండాల అభివృద్ధి సాధ్యమని గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కల్యాణ్నాయక్, నాగర్కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వేముల నరేందర్రావు అన్నారు. కేంద్రంలో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి 11 ఏళ్లే పూర్తయిన సందర్భంగా సోమవారం మండల పరిధిలోని మైసిగండిలో పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్ దోనాదుల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోదీ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.

ఒకే దరఖాస్తు..!

ఒకే దరఖాస్తు..!

ఒకే దరఖాస్తు..!