
నిరుత్సాహం వద్దు!
బొంరాస్పేట: నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం, అనుబంధ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఉచిత నైపుణ్య శిక్షణతో నేరుగా ఉద్యోగం పొందేలా తర్ఫీదునివ్వనున్నారు. వారి ఆసక్తికి అనుగుణంగా వారు కోరుకునే విధంగా నైపుణ్యం పెంపొందించుకుని ఎదగవచ్చు. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఇదొక సువర్ణావకాశమని కొడంగల్ ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆయన వివరించారు.
యంగ్ ఇండియా సహకారంతో..
హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల్లో యంగ్ ఇండియా సహకారంతో నైపుణ్యాల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. కొడంగల్ ప్రాంతంతో ఇంటర్ ఆపై చదివుకున్న నిరుద్యోగులకు ఈ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు.
శిక్షణ ఇలా..
స్కిల్ యూనివర్సిటీ(నైపుణ్యాల విశ్వవిద్యాలయం)ద్వారా శిక్షణలుంటాయి. బీఎఫ్ఎస్ఐ తదితర రంగాల్లో వారం పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. లాజిస్టిక్స్ శిక్షణ, ఇంటర్వ్యూ అనంతరం ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తున్నారు. అమేజాన్, స్విగ్గీ తదితర కంపెనీలలో ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇవ్వనున్నారు.
రేపు జాబ్మేళా
ఈ నైపుణ్యాల శిక్షణపై పట్టణ సమీపంలోని బండల ఎల్లమ్మ ఆలయం వద్దనున్న ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఈనెల 18న బుధవారం నిర్వహించనున్న జాబ్మేళాలో ఉచిత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియెట్ పూర్తిచేసినవారు, డిగ్రీ రెండో సంవత్సరం లేదా డిగ్రీ పూర్తయిన వారు అర్హులంటున్నారు.
నైపుణ్య శిక్షణతో ఉద్యోగం సొంతం
24 ఏళ్ల లోపు యువతకు
ఉచిత నైపుణ్య శిక్షణ
రేపు కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన
సీఎం నియోజకవర్గంలో సరికొత్త శిక్షణ
యువతకు సదావకాశం
నైపుణ్యాల శిక్షణ యువత కు సదవకాశం. పేద, మఽ ద్య తరగతి యువత సద్వినియోగం చేసుకోవాలి. ఈ నైపుణ్య శిక్షణపై యంగ్ ఇండియా వీసీ, హైదరాబాద్ ప్రొఫెసర్లు అవగాహన కల్పించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ మెమోలను డిగ్రీకశాళాలలోని డాక్టర్ మనోహర్ హాలులో అందజేయాలి.
– డాక్టర్ బి.శ్రీనివాస్రెడ్డి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొడంగల్

నిరుత్సాహం వద్దు!