పనులను వేగిరం చేయండి | - | Sakshi
Sakshi News home page

పనులను వేగిరం చేయండి

Jun 17 2025 6:59 AM | Updated on Jun 17 2025 6:59 AM

పనులను వేగిరం చేయండి

పనులను వేగిరం చేయండి

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

నవాబుపేట: విద్యార్థులు లక్ష్యంతో చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో కేజీబీవీని సందర్శించారు. పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్ను అదనపు గదులను పరిశీలించి పనులను వేగిరం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు యూనిఫాం, నోట్‌ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గీతాసింగ్‌ నాయక్‌, ప్రిన్సిపాల్‌ శ్రీలత, నాయకులు వెంకట్‌రెరెడ్డి, ప్రభాకర్‌, ఎక్బాల్‌, రాజశేఖర్‌ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులు వినియోగించుకోండి

భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్త్ను రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య సూచించారు. మండల పరిధిలోని చిట్టిగిద్ద గ్రామంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు. తహసీల్దార్‌ బుచ్చయ్య, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీలత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement