విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి

Jun 17 2025 6:59 AM | Updated on Jun 17 2025 6:59 AM

విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి

విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి

తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌

కొడంగల్‌: మండల పరిధిలోని ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు ఎరన్‌పల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎంఈఓ రాంరెడ్డికి వినతిపత్రం అందజేశారు. జీఓ నంబర్‌ 46 ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన పేద బలహీన వర్గాలకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఫీజులు వసూలు చేయాలన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు పెంచుతూ పాఠ్య పుస్తకాలు, అడ్మిషన్‌ ఫీజులు అంటూ వ్యాపారం చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓంకార్‌, సికిందర్‌, భాను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement