విద్యార్థి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి అదృశ్యం

Jun 16 2025 7:19 AM | Updated on Jun 16 2025 7:19 AM

విద్యార్థి అదృశ్యం

విద్యార్థి అదృశ్యం

పహాడీషరీఫ్‌: విద్యార్థి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి లో చోటు చేసుకుంది. పో లీసులు తెలిపిన ప్రకారం.. మామిడిపల్లి ముదిరాజ్‌ కాలనీకి చెందిన సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ రాకోటి మురళీమోహన్‌ కుమారుడు దివ్యసాయి(19) నీట్‌ పరీక్ష రాసి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నాడు. ఈ నెల 9న తల్లిదండ్రులు పనిమీద బయటికి వెళ్లి మధ్యా హ్నం వచ్చి చూడగా దివ్యసాయి కనిపించలేదు. అతని ఆచూకీ కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తండ్రి ఠానాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో గానీ, 87126 62367 నంబర్‌లో గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు.

పరీక్ష రాసేందుకెళ్లి..

ఇబ్రహీంపట్నం: పరీక్ష రాసేందుకని వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ జగదీశ్‌ కథనం ప్రకారం.. శంషాబాద్‌కు చెందిన విద్యార్థిని (23) ఇబ్రహీంపట్నం మండలం రాందాసుపల్లి పరిధిలోని ఏవీఎన్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు పరీక్ష రాసేందుకు కళాశాలకు బయలుదేరి తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబసభ్యులు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement