
కొడుకు జ్ఞాపకాలతో విరాళం
ఆలయ అభిృద్ధికి హామీ
బొంరాస్పేట: కొడుకు లేడన్న బాధను దిగమింగుకొని, పుత్రుడి జ్ఞాపకాలతో ఓ తండ్రి.. ఫాదర్ డే రోజు ఆదివారం ఆలయానికి రూ.10 వేలతో గంట, గేటు చేయించాడు. మరో నాలుగేళ్లలో పురాతన ఆలయానికి మరమ్మతు పనులు చేయిస్తానని హామీ ఇచ్చాడు. మండల పరిధి రేగడిమైలారానికి చెందిన గుర్మిట్కల్ హన్మిరెడ్డి కొడుకు నవీన్కుమార్రెడ్డి.. గతేడాది పొలం పనులకు వెళ్తూ విద్యుదాఘాతంతో చనిపోయాడు. కొడుకు అకాల మరణం చెందడాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి.. తన బిడ్డ చనిపోలేదని, నేరుగా శివుడి వద్దకు చేరాడని పేర్కొనడం గమనార్హం. కొడుకు చనిపోయాడన్న బాధలో ఉండి కూడా.. ఆలయానికి తనకు తోచిన విరాళం అందజేసిన దాత హన్మిరెడ్డికి ఆలయ పూజారి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జగదీశ్వరయ్య కృతజ్ఞతలు తెలిపారు.