పద్మమ్మకు నివాళి | - | Sakshi
Sakshi News home page

పద్మమ్మకు నివాళి

Jun 16 2025 7:19 AM | Updated on Jun 16 2025 7:19 AM

పద్మమ

పద్మమ్మకు నివాళి

ధారూరు: మండల పరిధిలోని చింతకుంటలో ఆదివారం దివంగత ఇంద్రారెడ్డి సోదరి పద్మమ్మ దశదిన కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సబితారెడ్డి హాజరై నివాళి అర్పించారు. ఆమె వెంట బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు హఫీజ్‌ తదితరులు హాజరయ్యారు.

విద్యుదాఘాతంలో

ఆవు మృతి

తాండూరు రూరల్‌: విద్యుదాఘాతంలో ఓ ఆవు మృత్యువాత పడింది. ఈ ఘటన పెద్దేముల్‌ మండలం ఎర్రగడ్డతండాలో ఆదివారం చోటు చేసుకుంది. తండాకు చెందిన శాంతబాయి రోజు మాదిరిగానే ఆవులను మేతకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో తండాశివారులోని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌ తగిలి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో సుమారు రూ.50 వేలు ఆర్థికంగా నష్టపోయానని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతోంది.

పశువుల నీటి తొట్టి ధ్వంసం

బషీరాబాద్‌: పశువుల దాహార్తిని తీరుస్తున్న నీటితొట్టిని గ్రామానికి చెందిన ఓ నాయకుడు ధ్వంసం చేయించాడు. ఈ సంఘటన బషీరాబాద్‌ మండలం కాశీంపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మూగజీవాల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం.. ఉపాధి నిధులతో పదిహేనేళ్ల క్రితం తొట్టిని నిర్మించింది. తొట్టి ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు ఓ జాతీయ పార్టీకి చెందిన యువ నాయకుడు జేసీబీతో ధ్వసం చేయించాడు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన సదరు వ్యక్తిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవా లని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

పేదలకు వరం

ఇందిరమ్మ ఇళ్లు

కుల్కచర్ల: పేదలకు వరం ఇందిరమ్మ ఇళ్లు అని, అర్హులందరికీ ప్రభుత్వం ఇంటిని నిర్మించి ఇస్తుందని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు ముదిరాజ్‌ అన్నారు. ఆదివారం మండల పరిధి ముజాహిద్‌పూర్‌లో లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు షర్పొద్దీన్‌, సోమలింగం, రాములు, అంబదాస్‌, కిష్టయ్య, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

198 మందికి వైద్య పరీక్షలు

యాలాల: మండల పరిధిలోని విశ్వనాథ్‌పూర్‌లో ఆదివారం తాండూరు వాసవి ఆస్పత్రి వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో గ్రామానికి చెందిన 198 మంది ప్రజలు వైద్య పరీక్షలు నిర్వహించుకున్నట్లు ఆస్పత్రి యజ మాని సతీశ్‌ కుమార్‌, వైద్యుడు విజేందర్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు తమ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత పరీక్షలతో పాటు మందులను పంపిణీ చేస్తున్నామన్నారు.

కాడెద్దు అపహరణ

ఆమనగల్లు: తలకొండపల్లి మండలం చుక్కాపూర్‌ గ్రామంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాడెద్దును తరలించుకుపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు బైకని పర్వ తాలు యాదవ్‌.. పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయ పొలం వద్ద ఐదు ఆవులు, రెండు కాడెడ్లను ఉంచాడు. ఆమనగల్లు– షాద్‌నగర్‌ రహదారి పక్కనే పశువుల పాక ఉండటంతో.. దుండగులు రూ.లక్ష విలువ చేసే ఎద్దును అపహరించారు. ఆదివారం ఉదయం పాక లో ఓ ఎద్దు లేదని గుర్తించిన బాధిత రైతు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

పద్మమ్మకు నివాళి 1
1/3

పద్మమ్మకు నివాళి

పద్మమ్మకు నివాళి 2
2/3

పద్మమ్మకు నివాళి

పద్మమ్మకు నివాళి 3
3/3

పద్మమ్మకు నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement