
అలుగు ఆధునికీకరణ ఎప్పుడో!
కోట్పల్లి ప్రాజెక్టు అలుగుపై సీసీ బెడ్ నీటి ప్రవాహ ఉధృతికి చిత్తడిగా మారింది. 2021లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టు పూర్తిగా నిండి నీటి ఉధృతి అలుగుపై పారడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. అప్పట్లో మరమ్మతు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేపట్టడంతో తిరిగి శిథిలమైంది. ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.110 కోట్లు మంజూరయ్యాయని చెబుతున్నా పనుల్లో పురోగతి లేదని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఇరిగేషన్ శాఖ అధికారులు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. – ధారూరు