
నేడు తాండూరుకు అజారుద్దీన్
తాండూరు: భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మ ద్ అజారుద్దీన్ ఆదివారం తాండూరుకు రానున్నారు. పట్టణానికి చెందిన వ్యాపారి ముజీ బ్ఖాన్ ఆధ్వర్యంలో విలియంమూన్ మైదానంలో కొనసాగుతున్న క్రికెట్ టోర్నీ ఫైన ల్ దశకు చేరుకుంది. ఈ సందర్భంగా శాసనమండలి చీఫ్ విప్ మహేందర్రెడ్డితో కలిసి విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.
108లో గర్భిణి ప్రసవం
కొడంగల్ రూరల్: మండల పరిధిలోని చిట్లపల్లితండాకు చెందిన వాణిశ్రీ శుక్రవారం రాత్రి 108 అంబులెన్స్లో ప్రసవించింది. గ్రామంలో ఉన్న ఆమెకు పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం అందించారు. ఆమెను వాహనంలో కొడంగల్ నుంచి తాండూరుకు తరలిస్తుండగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో తాండూరు ఆస్పత్రిలో జాయిన్ చేశామని వాణిశ్రీ బంధువులు తెలిపారు.
వీధి కుక్కల దాడిలో రైతుకు గాయాలు
దోమ: వీధి కుక్కల దాడిలో ఓ రైతుకు గాయాలయ్యాయి. ఈ ఘటన దోమ మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రానికి చెందిన బోయిని కిష్టప్ప ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ గుంపులుగా ఉన్న కుక్కలు ఒక్కసారిగా అతనిపై దాడి చేశాయి. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించి మందులు పంపిణీ చేశారు. గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఎక్కవ ఉందని వాటిని జనవాసాలనుంచి తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సీసీ రోడ్డుపై జారిపడి చిన్నారి మృతి
దిర్సంపల్లిలో ఘటన
దోమ: ఇంట్లో నుంచి వెళ్తున్న బాలుడు ప్రమా దవశాత్తు జారిపడి మృతిచెందాడు. ఈ ఘటన దోమ మండల పరిధి లోని దిర్సంపల్లిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ రాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంగీత, రమేశ్కు వేణుమాధవ్(4), అనూష(2) సంతానం. ఉదయం 10 గంటల సమయంలో ఆడుకునేందుకు బయటకు వస్తుండగా వాకిట్లోని సీసీ రోడ్డుపై కుప్పకూలి ప్రాణం కోల్పోయాడు. ఇది గమనించిన పక్కింటి మహిళ పరుగున వెళ్లి సంగీతకు చెప్పింది. తల్లి వచ్చి బాలుడిని కదపగా ఉలుకు, పలుకు లేకపోవడంతో లబోదిబోమని రోదించింది. చుట్టు పక్కల వారు అక్కడి చేరుకునిపరిశీలించేసరికే చిన్నారి మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రుత్విక్ జ్యోషికి 557 ర్యాంకు
కొడంగల్ రూరల్: పట్టణానికి చెందిన రాము జ్యోషి కుమారుడు రుత్విక్ జ్యోషి నీట్లో ఆలిండియా లెవల్లో 557 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు రుత్విక్ను అభినందించారు.

నేడు తాండూరుకు అజారుద్దీన్

నేడు తాండూరుకు అజారుద్దీన్

నేడు తాండూరుకు అజారుద్దీన్