ఒకే దేశం.. ఒకే ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఒకే దేశం.. ఒకే ఎన్నిక

Jun 3 2025 7:02 AM | Updated on Jun 3 2025 7:02 AM

ఒకే దేశం.. ఒకే ఎన్నిక

ఒకే దేశం.. ఒకే ఎన్నిక

● ఇదే బీజేపీ నినాదం ● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

పరిగి: దేశంలో నిత్యం ఎన్నికలు జరగడం ద్వారా అభివృద్ధి కుంటు పడుతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం పరిగి పట్టణంలో ఒకే నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే వేల కోట్ల రూపాయల ఖర్చు తగ్గుతుందన్నారు. ప్రతి మూడు, నాలుగు నెలలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా కోడ్‌ అమల్లోకి వచ్చి అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. వీటన్నంటినీ దృష్టిలో ఉంచుకునే ఒకే సారి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. గడిచిన పదేళ్లలో దేశం ఎంతో పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ఇది ప్రధాని మోదీతోనే సాధ్య మైందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అలాగే అర్హులైన వారికి పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement