
దైవచింతనతో మానసిక ప్రశాంతత
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి
మర్పల్లి: దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. మండలంలోని పట్లూర్లో మూడు రోజులుగా దుర్గామాత ఉత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం ముగింపు వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని, ఇందుకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, మండల అధ్యక్షుడు రామేశ్వర్రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లేశ్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, నాయకులు బలరాంగౌడ్, తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ దర్శించుకున్నారు. వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ బాల్క్ –2 అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల మాజీ అధ్యక్షులు ప్రభాకర్, రవిందర్, జిల్లా కార్యదర్శి సంజీవరెడ్డి పాలొన్నారు.