
విద్యారంగాన్ని కాపాడుకుందాం
కడ్తాల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచి విద్యారంగాన్ని కాపాడుకుందామని టీఎస్యూటీఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్నాయక్ పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మండల పరిధిలోని అన్మాస్పల్లిలో సోమవారం ప్రచార జాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ హితం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. అన్ని రకాల మౌలిక వసతులతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి శంకర్నాయక్, మండల అధ్యక్షుడు జంగయ్య, మాజీ సర్పంచ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.