
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
దుద్యాల్: అదుపుతప్పిన కారు విద్యుత్ సం్తభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన మండల పరిధిలోని ఈర్లపల్లి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. బొంరాస్పేట్ మండలం చౌదర్పల్లికి చెందిన కావలి రాజు, సిద్ధు పని నిమిత్తం నారాయణపేట్ జిల్లా కోస్గి పట్టణానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈర్లపల్లి సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం మూడు ముక్కలయింది. కారు నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న యువకులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
తప్పిన పెను ప్రమాదం