బీజేపీతోనే నూతన సంస్కరణలు | - | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే నూతన సంస్కరణలు

May 3 2025 8:33 AM | Updated on May 3 2025 8:33 AM

బీజేపీతోనే నూతన సంస్కరణలు

బీజేపీతోనే నూతన సంస్కరణలు

పరిగి: అరవైఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ఎందుకు కులగణన చేపట్టలేదని.. నూతన సంస్కరణలు బీజేపీతోనే సాధ్యమని.. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కుల గణన చేపట్టాలని నిర్ణయించడంతో శుక్రవారం బీజేపీ శ్రేణులు ప్రధాని మోది చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ.. కులగణనతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందన్నారు. దేశంలోని అన్ని పార్టీలు కులగణను స్వాగతిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన కులగణన అశాస్త్రీయంగా ఉందని.. కేంద్రం నిర్వహించే జనగణనతోనే ప్రజలకు న్యాయం చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాముయాదవ్‌, కార్యదర్శి పెంటయ్యగుప్తా, పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement