
మొదటి గురువు బసవేశ్వరుడు
శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
అనంతగిరి: కుల, మత రహిత సమాజ నిర్మాణానికి కృషి చేసిన మహనీయుడు బసవేశ్వరుడని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నా రు. బుధవారం మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ఎన్నెపల్లిలోని జగజ్యోతి బసవేశ్వర విద్యా సంస్థల్లో నిర్వహించిన జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. సమాజం పట్ల అవగాహన కల్పించిన మొదటి గురువు బసవేశ్వరుడు అన్నా రు. ఆయన ఇచ్చిన శాంతి సందేశంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన సాగుతోందన్నారు. ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ బస్వరాజు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్, కాంగ్రె స్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోశ్ కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్రె డ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్కుమార్, వీరశైవ సమాజం ప్రతినిధులు శివరాజు, ఆత్మలింగం, వీరన్న, విజయ్కుమార్, నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, షరీఫ్, వెంకట్రెడ్డి తదితరుల పాల్గొన్నారు. వికారాబాద్లో వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.