చెరువులకు జలకళ | - | Sakshi
Sakshi News home page

చెరువులకు జలకళ

Oct 24 2025 8:03 AM | Updated on Oct 24 2025 8:03 AM

చెరువ

చెరువులకు జలకళ

● సాగుతున్న వాగులు,వంకలు ● సాగిన స్వర్ణముఖి..నిండిన మల్లెమడుగు ● గూడురు నియోజకవర్గం చిల్లకూరు మండలంలోని ఉప్పుటేరు ప్రవహిస్తోంది. దాంతో తిప్పుగుంటపాళెం గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. ● సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలంలో స్వర్ణముఖి, తడ మండలంలో కార్వేటి కాలువ, సూళ్లూరుపేట మండలంలో కాళంగి నది, మామిడి కాలువ ప్రవహిస్తున్నాయి. దీంతో రైతులు నారుమళ్లు పోయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ● సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలోని ఆరణియార్‌ ప్రాజెక్టు, కేవీబీపురం మండలంలోని కాళంగి రిజర్వాయర్‌కు నీళ్లు వచ్చాయి. ● శ్రీకాళహస్తి నియోజకవర్గం రెండు రోజులుగా కురిసిన వర్షాలకు చెరువులకు కొంత మేరకు నీరు చేరింది. స్వర్ణముఖినది సాగుతుంది. ఈ నది ఆధారంగా శ్రీకాళహస్తి మండలంలోని పలువురు రైతులు కూరగాయల తోటలు సాగు చేస్తుంటారు. వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేణిగుంట మండలంలోని మల్లెమడుగు రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో నిండడంతో గేట్లు ఎత్తివేశారు. ● చంద్రగిరి నియోజకవర్గంలో పంట, వరద కాలువలు ఆక్రమణలకు గురికావడంతో వర్షపునీరు పలు గ్రామాలు, ఎస్సీ కాలనీల మీదుగా ప్రవహిస్తోంది. దీంతో స్థానికులకు ఇబ్బందులు తప్పలేదు. ప్రధానంగా నల్లకాలువను పూడ్చివేయడంతో భాగ్యనగరం, తనపల్లి గ్రామాల్లో నీరు చేరాయి. ● వెంకటగిరి నియోజకవర్గంలోను ఈ వర్షాలకు ఏ చెరువు నిండలేదు. అయితే అన్ని చెరువులకు కొంత మేరకు నీరు చేరాయి.

తిరుపతి అర్బన్‌: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. అలాగే వాగులు, వంకలు, కాలువలు సాగడంతో రైతులు ఈ ఏడాది పంట సాగుకు ఇబ్బంది ఉండవని భావిస్తున్నారు. ప్రధానంగా స్వర్ణముఖి నది సాగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీకి వర్షంతో రూ.కోటి నష్టం

మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రయాణికులు తగ్గిపోయారు. మరోవైపు ఆర్టీసీ అన్ని మార్గాల్లో తిప్పలేదు. దీంతో రోజుకు రూ.30 లక్షలు చొప్పున మూడు రోజుల్లో రూ.కోటికి పైగా నష్టం చోటుచేసుకుంది.

కూలిన పూరిగుడిసెలు

బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆలత్తూరు గ్రామ దళితవాడలో ఒక పూరి గుడిసె, పట్టాభిగిరిజన కాలనీలో మూడు పూరిగుడిసెలు కూలాయి. పూరి గుడిసెలు కూలిపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రాత్రంతా వర్షానికి తడుస్తూ, చలి గాలులతో నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వం స్పందించి కూలిన పూరిగుడిసెలకు నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.

బురదలో కూరుకుపోయిన ఆర్టీసీ బస్సు

కలువాయి(సైదాపురం): మండలంలోని దాచూరు కొలపనాయుడుపల్లి గ్రామాల మధ్యలో గురువారం ఆర్టీసీ బస్సు బురదలో కూరుకుపోయింది. వర్షాలకు బురదమయం కావడంతో రోడ్డు పక్కన దిగిన బస్సు ఇరుక్కుపోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు.

20 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

వాకాడు: మండలంలో గురువారం దాదాపు 20 మీటర్లు సముద్రం ముందుకొచ్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు అధికంగా రావడంతో వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్‌లో ఉధృతంగా ప్రవహిస్తోంది. దిగువన ఉన్న బాలిరెడ్డిపాళెం – గంగన్నపాళెం గ్రామాల మధ్య వంతెన నీట మునిగి ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సముద్రపు కెరటాలు తీర గ్రామాలను తాకుతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఒడ్డున ఉన్న తమ వేట సామగ్రిని భద్రపరుస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు, మైరెన్‌ అధికారులతోపాటు వాకాడు తహసీల్దార్‌ మహ్మద్‌ ఇగ్బాల్‌, ఎంపీడీఓ సాయిప్రసాద్‌ సముద్ర తీరాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. రొయ్యల కాలవ, పులికాలవ పొంగిపొర్లడంతో అక్కడక్కడా లోతట్టు రహదారులు నీటి మునిగిపోయాయి. బ్యారేజ్‌లో 35 ఎంసీటీఎఫ్‌ నీరు నిల్వ ఉండగా 8 గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు వరదనీటిని దిగువ ప్రాంతాలకు వదిలిపెట్టారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ హెచ్చరికలు జారీ చేశారు.

చెరువులకు జలకళ1
1/4

చెరువులకు జలకళ

చెరువులకు జలకళ2
2/4

చెరువులకు జలకళ

చెరువులకు జలకళ3
3/4

చెరువులకు జలకళ

చెరువులకు జలకళ4
4/4

చెరువులకు జలకళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement