
పీజీ సెట్లో 88.60 శాతం ఉత్తీర్ణత
తిరుపతి సిటీ : రాష్ట్ర వ్యాప్తంగా 17 వర్సిటీల్లోని 143 పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 9 నుంచి నాలుగు రోజులు ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ పీజీ సెట్ ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఎస్వీయూలో వీసీ, పీజీ సెట్ చైర్మన్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు సబ్జెక్టుల వారీగా ఫలితాలు వెల్లడించారు. వారు మాట్లాడుతూ పరీక్షలకు 21,995 మంది హాజరుకాగా 19,488 మంది అర్హత సాధించినట్టు తెలిపారు. 88.60 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. ఎస్వీయూ రీజియన్లో 5,764 మంది పరీక్ష రాయగా 5,019 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,422 మంది పరీక్షలకు హాజరుకాగా 1,279 మంది అర్హత సాధించినట్టు వెల్లడించారు. జాగ్రఫీ, జనరల్ టెస్ట్లో చిత్తూరు జిల్లాకు చెందిన దివ్వేష్రెడ్డి, ఎం.ప్రేమ్కుమార్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్టు వివరించారు.
సీట్లు 25 వేలు, ఉత్తీర్ణులైన అభ్యర్థులు 19 వేలు
రాష్ట్రంలోని అన్ని వర్సిటీలో 25 వేలకు పైగా పీజీ సీట్లు ఉన్నాయి. ఏపీ పీజీ సెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు 19,488 మంది. ఒక సీటుకు ఒక అభ్యర్థి కూడా పోటీ లేకపోవడం విశేషం. తద్వారా 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్సిటీల్లో పీజీ అడ్మిషన్లు భారీ స్థాయిలో పడిపోనున్నాయి. దీంతో వర్సిటీల భవితవ్యం ప్రశ్నార్థకమేనంటూ మేధావు లు, విద్యానిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఫలితాలు విడుదల
ఎస్వీయూ రీజియన్లో 87.07 శాతం ఉత్తీర్ణత
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో
89.94 శాతం
జాగ్రఫీ, జనరల్లో ఉమ్మడి జిల్లా
విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్
పీజీ సెట్–2025 ఫలితాల వివరాలు
కోర్సులు సెట్కు హాజరైన ఉత్తీర్ణులైన
అభ్యర్థులు వారు
కెమికల్ సైన్స్ 5,396 4,719
లైఫ్ సైన్స్ 3,641 3,408
కంప్యూటర్ కోర్సులకు 1,858 1,547
కామర్స్ 1,203 1,009
ఇంగ్లీష్ 721 702
హ్యుమానిటీస్ 736 726
జువాలజీ 1,347 1,177
గణితం 983 821
ఫిజిక్స్ 808 652
బోటనీ 1,146 1,041
ఇతరాలు 4,156 3,686
మొత్తం 21,995 19,488