30 నుంచి శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

30 నుంచి శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు

Jun 26 2025 10:09 AM | Updated on Jun 26 2025 10:09 AM

30 నుంచి శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు

30 నుంచి శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు

చంద్రగిరి:శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యా ణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 2 వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం చేపడతారు. అనంతరం 7 నుంచి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. 30వ తేదీ ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్‌ సేవ, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనం నిర్వహిస్తారు. జూలై 1వ తేదీ ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్‌ సేవ, రాత్రి 7 గంటలకు హనుమంత వాహనం ఉంటాయి. జూలై 2వ తేదీ ఉదయం స్నపన తిరుమంజనం, ఊంజల్‌ సేవ చేపడతారు. రాత్రి 7 గంటలకు స్వామి వారి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. చివరిరోజు జూలై 3వ తేదీ ఉదయం పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. వైభవోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement