
కంటైనర్లో మంటలు
తిరుపతి రూరల్, (రామచంద్రాపురం) : రామ చంద్రాపురం మండలం చల్లావారి పల్లెకు చెందిన కాంతమ్మ (70) శుక్రవారం పొలం వద్ద గడ్డికోసుకుని వస్తుండగా వెనుకనే వచ్చిన ఓ వ్యక్తి వృద్ధురాలి మెడలోని బంగారం గొలుసును లాక్కొని వెళ్లాడు. దీంతో వృద్ధురాలు వారిని పట్టుకోలేక గట్టిగా కేకలు పెట్టినప్పటికీ అక్కడ అందుబాటులో ఎవ్వరు లేరు. అనంతరం రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.