
కంటైనర్లో మంటలు
తడ పోలీస్ స్టేషన్ ఎదుట కంటైనర్లో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
దొంగలు అరెస్టు
దొరవారిసత్రం, ఓజిలి మండలాల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.
శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025
– 10లో
నాడు సంక్షేమం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో నవరత్నాల పేరిట అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. సచివాలయ సిబ్బంది ద్వారా అర్హత కలిగిన ప్రతి ఇంటి గడపను తాకింది.
నేడు మోసం
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సంక్షేమం పూర్తిగా అటకెక్కింది. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే వ్యూహంలో భాగంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నాయకులు ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతు సవరించారు.
గత ఐదేళ్లల్లో సర్వేలు లేకుండా సంక్షేమ పథకాలు
గత ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ సర్కారు ఎలాంటి సర్వేలు నిర్వహించకుండానే సంక్షేమ పథకాలను అమలు చేసింది. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా సంక్షేమ పాలనను అందించింది. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నవరత్నాల హామీల మేనిఫెస్టో ప్రకారం సంక్షేమ పథకాలను ప్రజలకు అందించింది. అయితే ప్రస్తు త కూటమి సర్కారు సర్వే ల పేరుతో చేస్తున్న కుట్రలను ప్రజ లు విమర్శలు గుప్పిస్తున్నారు.
వివరాల గోప్యతపై అనుమానం
సచివాలయం సిబ్బంది పలుమార్లు ఇంటికి వచ్చి ఆధార్, రేషన్కార్డు వివరాలు సేకరించారు. సేకరించిన వివరాలు గోప్యంగా ఉన్నాయా లేవా అనే ఆందోళన ఉంది. అందించిన సేవల కన్నా చేసిన సర్వేలు ఎక్కువగా ఉన్నాయి. సర్వేల్లో వ్యక్తిగత వివరాలతో ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయంగా ఉంది. – వై.భాగ్యమ్మ,
కొత్త ఒడ్డిపల్లి, పాకాల మండలం
ఆశ చూపి మోసం చేశారు
ఎన్నికల్లో వివిధ రకాల హామీలను ఆశ చూపి మోసం చేశారు. ఏడాది గడిచినా హామీల్లో అమలు చేయకపోయినా ప్రతి ఇంటా ప్రతి రోజు 17 రకాల సర్వేల పేరుతో సర్వేలు చేస్తున్నారు. సర్వేల ద్వారా ఏమైనా పథకాలు వస్తాయిలే అనే ఆశతో ఉన్నారు. నేటికి ఎలాంటి ప్రయోజనం కానరాలేదు. – శ్రీనివాసులురాజు,సైదాపురం మండలం
సర్వేల ఆంతర్యం ఏమిటో
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలోనే సచివాలయ ఉద్యోగుల నేతృత్వంలో 17కి పైగానే సర్వేలు చేపట్టారు. సర్వే చేసిన సందర్భంగా సర్కార్ సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ఆశ పడ్డాం. అయితే మొదటి ఏడాది కాలం పథకాలు ఇవ్వలేదు. పథకాలు ఇవ్వకపోవడంతో తొలగిస్తారనే ఆందోళన తప్పడం లేదు. – సుదర్శన్, తిరుపతి
పథకాలు అమలేదీ
సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు ఎక్కడా....ఎప్పుడు ఇస్తారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 12 నెలలు పూర్తి అయింది. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలో కూర్చున్న తర్వాత పథకాలకు డబ్బులు లేదని మాట్లాడుతున్నారు. పథకాలు ఇవ్వనప్పుడు సర్వేలు ఎందుకు చేయించారో ప్రజలకు చెప్పాలి. – యశోద, తిరుపతి
ఎందుకు చేస్తున్నారో తెలియదు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పలుసార్లు ఇళ్ల వద్దకు సచివాలయం సిబ్బంది వచ్చి సర్వేల పేరుతో ఆధార్ నమోదు, వేలి ముద్రలు సేకరించారు. సర్వేలపై ప్రశ్నిస్తే ఒక్కోసారి ఒక్కో రకమైన సమాధానాలు ఇచ్చారు. పలుసార్లు సర్వే పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరించడం ఏమిటో అర్ధం కావడం లేదు.– ఒత్తూరు మునిక్రిష్ణ,
మెట్టు, చిట్టమూరు మండలం
ఎన్నికల సమయంలో సూపర్ –6 హామీలంటూ చంద్రబాబు అలవికాని హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత సర్వేల మీద సర్వేలు చేస్తూ ఏడాదిగా కూటమి ప్రభుత్వం కాలయాపన చేసింది. ఇప్పటి వరకు ప్రజలకు ఏ ఒక్క పథకం అందకపోవడంతో చేసిన సర్వేలన్నీ ఉత్తుత్తివేనా అని జనం నిట్టూరుస్తున్నారు. సర్వేలో వ్యక్తిగత సమాచారం తీసుకున్న ఉద్యోగులు వాటిని ఎందుకు తీసుకున్నారో ప్రజలకు చెప్పలేకపోతున్నారు. ఈ సమాచారం గోప్యతపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో సర్వేలు చేశారే గాని.. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఎగ్గొట్టారు. ఈ సర్వేల తతంగంపై జిల్లాలోని ప్రజల ఆగ్రహంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.
చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికి లబ్ధి కలిగేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి హామీలు గుప్పించింది. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీలు నెరవేర్చాల్సి ఉంటుంది. అయితే ఆ హామీలను అమలు చేయకుండా సర్వేలతోనే ఏడాదిగా కాలయాపన చేసింది. సర్వేలతో ప్రజలకేమైనా లాభం చేకూరిందా అంటే అదీ లేదు.
ఇంటింటికి తిరిగి సర్వేలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిగా సర్వేల పైనే ఎక్కువ మక్కువ చూపించింది. సచివాలయ ఉద్యోగులను పలు మార్లు ఇంటింటికి తిప్పి ప్రజల వ్యక్తిగత సమాచారాలను సేకరించారు. ఆ సమాచారాలు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తే సంక్షేమ పథకాల అమలు కోసమని మాయమాటలు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో సచివాలయ సిబ్బంది నెలల తరబడి ఇంటింటికీ తిరిగి ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించారు. హౌస్హోల్డ్ సర్వే పేరుతో వివరాలు సేకరించారు. మనమిత్ర క్యాంపెయిన్ పేరుతో సర్వేలు చేపట్టారు. నాన్ రెసిడెంట్ పేరుతో సమాచారాన్ని సేకరించారు. అదర్ డిపార్ట్మెంట్ ఈకేవైసీ సొసైటీ బ్యాంక్ ఓటర్ల పేరుతో సర్వే చేపట్టారు. ఇవే కాకుండా పలు రకాల సర్వేలు చేపట్టి ప్రజలను గందరగోళానికి గురిచేశారు.
విచారణ పేరుతో పింఛన్ల కోత
పింఛన్ రూ.1000 పెంచామని గొప్పలు చెప్పకుంటున్న ప్రభుత్వం విచారణ పేరుతో వేలాది పెన్షన్లను తొలగించే చర్యలు ఇప్పటికే చేపట్టిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం పీ4 సర్వే చేపట్టడం ఇందులో భాగమనే సందేహాలు ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి. సంపాదన పరుల జాబితాలో వ్యవసాయ కూలీలు, ఫింఛనర్ల పేర్లు చోటుచేసుకున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సర్వేపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే గుట్టు బాబుకే ఎరుకని పరిశీలకులు వివరిస్తున్నారు.
– 10లో
న్యూస్రీల్
కూటమి ఏడాది పాలనలో సర్వేలతో కాలయాపన
సర్వేలు ఎందుకని అడిగితే సంక్షేమ
పథకాల కోసమంటూ సమాధానం
సర్వేలు చేశారే తప్ప పథకాలు
అమలు చేయని వైనం
సేకరించిన వ్యక్తిగత సమాచారానికి గోప్యత కరువు ?
పీ 4 సర్వేతో అన్ని వర్గాల్లో ఆందోళన
కూటమి ప్రభుత్వం పీ4 పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేపై జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమయ్యింది. సంక్షేమ పథకాల ఎత్తివేతకే ఈ సర్వే చేస్తున్నారనే అనుమానం బలపడింది. ఇప్పటికే ఎన్నికల ముందు ఎడతెరిపి లేని హామీలిచ్చిన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని అమలు చేయకపోగా ఏదో ఒక నెపంతో నీరుగార్చే యత్నాలు చేపట్టిన విషయం ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలో పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్టిసిపేషన్న్ (పీపీపీ) పేరిట సర్వే చేపట్టారు. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరించి ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, దాతల సహకారంతో గుర్తించిన నిరుపేదల జీవన పరిస్థితులు మెరుగు పరచడమే సర్వే ప్రధాన ఉద్దేశమని అధికారులు అంటున్నారు. అయితే ఈ సర్వే ఎన్నో సందేహాలు ప్రజల్లో తలెత్తాయి. సర్వేలో కుటుంబ సభ్యుల పేరిట వ్యవసాయ భూమి ఎంత ఉంది? మున్సిపల్ ప్రాంతాల్లో ఎన్ని సొంత గృహాలు ఉన్నాయి? నాలుగు చక్రాల వాహనాలు ఏమైనా ఉన్నాయా? కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా? ఇన్న్కం ట్యాక్స్ ఏమైనా చెల్లిస్తున్నారా? నెలకు విద్యుత్ వినియోగం ఎంత ? అనే అంశాలపై సచివాలయ సిబ్బంది ఆరా తీసి వివరాలు సేకరించి నమోదు చేశారు. సర్వే సిబ్బంది సేకరిస్తున్న వివరాల్లో ఎక్కువ భాగం ఆదాయానికి సంబంధించిన ప్రశ్నలే ఉండడం పలు సందేహాలకు తావిస్తోంది.
తిరుపతి జిల్లా సమాచారం
జిల్లాలోని మండలాలు 33
మొత్తం జనాభా 21.97 లక్షలు
పురుష జనాభా 10.99 లక్షలు
మహిళల జనాభా 10.98 లక్షలు
రూరల్ జనాభా 13.47 లక్షలు అర్బన్ జనాభా 8.50 లక్షలు
మొత్తం కుటుంబాలు 5.72 లక్షలు
ఎస్సీ జనాభా 5.19 లక్షలు
ఎస్టీ జనాభా 1.71 లక్షలు
వ్యక్తిగత సమాచారం గోప్యత ఉందా?
వివిధ రకాల సర్వేల పేరుతో కూటమి ప్రభు త్వం సేకరించిన ప్రజల వ్యక్తిగత వివరాలకు గోప్యత లేని దుస్థితి. ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకు వివిధ సర్వేలు చేపట్టిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కూటమి చేపట్టిన వివిధ సర్వేల్లో సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకే వాడుతున్నారా? ఇంకేమైనా కుట్రలు చేస్తున్నారా అనే సందేహం ప్రజల్లో తలెత్తుతోంది.

కంటైనర్లో మంటలు

కంటైనర్లో మంటలు

కంటైనర్లో మంటలు

కంటైనర్లో మంటలు

కంటైనర్లో మంటలు

కంటైనర్లో మంటలు

కంటైనర్లో మంటలు

కంటైనర్లో మంటలు

కంటైనర్లో మంటలు