ఉజ్వల భవితకు ఐఐటీ | - | Sakshi
Sakshi News home page

ఉజ్వల భవితకు ఐఐటీ

Jun 7 2025 1:10 AM | Updated on Jun 7 2025 1:10 AM

ఉజ్వల

ఉజ్వల భవితకు ఐఐటీ

ఏర్పేడు: జేఈఈ అడ్వాన్సుడ్‌–2025 అర్హత సాధించిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులకు తిరుపతి ఐఐటీ శనివారం ఓపెన్‌హౌస్‌ పేరిట ఆహ్వానించినట్లు ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఏర్పేడు సమీపంలో ఉన్న తిరుపతి ఐఐటీలో చేపడుతున్న విద్యా కార్యక్రమాలు, క్యాంపస్‌లో ఉన్న అధునాతన సౌకర్యాలు, అందుబాటులో ఉన్న కోర్సులు, అండర్‌ గ్రాడ్యుయేట్‌ కరికులం, డ్యూయల్‌ డిగ్రీ వెసులుబాటు, హాస్టల్‌ సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణ సౌకర్యాలు, విద్యార్థులు తమ మేథస్సుతో నూతన ఆవిష్కరణ వైపు తీర్చిదిద్దేందుకు ఐఐటీలో ఉన్న అవకాశాలను గురించి ప్రత్యేక సెషన్‌ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. అలాగే కార్యక్రమ అనంతరం విద్యార్థులు, వారి దల్లిదండ్రులతో క్యాంపస్‌ టూర్‌ ఏర్పాటు చేసి ఐఐటీలో ఉన్న అధునాతన సౌకర్యాలు, బోధనాభ్యసన విధానాలపై ప్రత్యక్ష అనుభవం కల్పించనున్నట్లు ఆయన వివరించారు. ఈ సెషన్‌కు విద్యార్థులు తల్లిదండ్రులతో కలసి స్వయంగా పాల్గొనవచ్చని, ఇక్కడకు వచ్చేందుకు వీలు కాని వారు ఆన్‌లైన్‌లోనూ హాజరు కావచ్చన్నారు. తిరుపతి ఐఐటీ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచి ఉన్నట్లు , ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకుని ఓపెన్‌హౌస్‌ సెషన్‌లో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.

తిరుపతి ఐఐటీ క్యాంపస్‌

నేడు తిరుపతి ఐఐటీలో ఓపెన్‌ హౌస్‌ సెషన్‌

ఉజ్వల భవితకు ఐఐటీ1
1/1

ఉజ్వల భవితకు ఐఐటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement