పేదల స్థావరాలపై ప్రతాపం | - | Sakshi
Sakshi News home page

పేదల స్థావరాలపై ప్రతాపం

Jun 5 2025 7:52 AM | Updated on Jun 5 2025 7:52 AM

పేదల స్థావరాలపై ప్రతాపం

పేదల స్థావరాలపై ప్రతాపం

ఏర్పేడు: శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులోని పేదలపై టీడీపీ నాయకుల దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. బుధవారం గ్రామానికి చెందిన 30మంది కుండలు తయారు చేసుకునే పేదలు బంకమట్టి నిల్వ చేసుకున్న స్థావరాలను టీడీపీ నేతలు ధ్వంసం చేసి స్థలాన్ని జేసీబీతో చదును చేశారు. స్థానికుల కథనం మేరకు.. గ్రామశివార్లలో ప్రభుత్వ భూమి రెండెకరాలు ఉంది. ఈ స్థలంలో దశాబ్దాల తరబడి కుమ్మరులు బంకమట్టి తెచ్చి అక్కడే నిల్వ చేసుకుని కుండలను తయారుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు కక్షపూరితంగా జేసీబీతో చదును చేసేశారు. బాధితులు మాట్లాడుతూ తాము నిల్వ చేసుకున్న మట్టినంతా పల్లపు ప్రాంతాల్లోకి తోసి చదును చేశారని, రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని వాపోయారు. ఉపాధి కోల్పోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement