అభివృద్ధి లేదు.. అంతా అరాచకమే! | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి లేదు.. అంతా అరాచకమే!

Jun 4 2025 12:46 AM | Updated on Jun 4 2025 12:46 AM

అభివృ

అభివృద్ధి లేదు.. అంతా అరాచకమే!

తిరుపతి రూరల్‌ :‘‘రాష్ట్రంలో అభివృద్ధి ఊసే లేదు.. అంతా అరాచకమే నడుస్తోంది. ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్‌.. సెవెన్‌ అంటూ చంద్రబాబు హామీలు గుప్పించారు. అధికారం కోసం నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పేశారు. ఇప్పుడు గల్లా పెట్టెలో డబ్బులు లేవు అంటూ చేతులెత్తేశారు. పదవి కోసం ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. అందుకే బుధవారం జిల్లావ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరుతో నిరసన వ్యక్తం చేయనున్నాం’’ అని వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం చంద్రగిరిలోని వైఎస్‌ఎంఆర్‌ కల్యాణ మండపంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా భూమనతోపాటు చిత్తూరు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిశీలకుడు చావా రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. భూమన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాలు మేరకు బుధవారం చేపట్టే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో టీడీపీ ఓడిపోయినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు బయటకు రావడానికి 3 ఏళ్లు పట్టిందన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు అధికారం పోయిన రెండు నెలలకే రోడ్డుపైకి వచ్చారని వెల్లడించారు. ప్రజలను నిలువునా మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూలదోసేంత వరకు పోరాటం చేయాలని కోరారు. రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రెడ్‌బుక్‌ రాజ్యాంగం చంద్రగిరి నుంచే ప్రారంభమైనట్టుందన్నారు. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతోందని మండిపడ్డారు.

మాఫియా పాలన నడుస్తోంది

కూటమి ప్రభుత్వంలో మాఫియా పాలన నడుస్తోందని చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు చొప్పున ప్రతి నెలా ఇస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ మాట ఇచ్చారన్నారు. ఎంత మందికి ఇచ్చారు..? ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉచిత బస్సుపై ఒక్కొక్కసారి ఒక్కో మంత్రి మీడియా ముందుకు వచ్చి ఉగాది నుంచి ఇస్తాం.. దీపావళికి అమలు చేస్తాం.. సంక్రాంతి నుంచి అమలు చేస్తాం అని ఉత్తుత్తి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే నాని ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని స్పష్టం చేశారు. మట్టి, ఇసుక అక్రమ రవాణా, భూ కబ్జాలు, లిక్కర్‌ మాఫియాను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు.

అభివృద్ధి లేదు.. అంతా అరాచకమే!1
1/1

అభివృద్ధి లేదు.. అంతా అరాచకమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement