
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
రేణిగుంట : స్థానిక వేణు గోపాలపురం సమాధుల వద్ద ముళ్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోలీసులు తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి 55 ఏళ్ల నుంచి 60 ఏళ్ల ఉంటాయని, ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
చదును చేసి.. చెరువు కబ్జా!
కలువాయి(సైదాపురం):మండలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక, మట్టి తవ్వకాలతోపాటు చెరువుల ఆక్రమణ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే కలువాయి మండలంబ మాదన్నగారిపల్లెలో సర్వే నంబర్ 56లో ఉన్న 3 ఎకరాల చెరువు పోరంబోకు భూమిని ఓ టీడీపీ నేత కబ్జా చేసేశాడు. యథేచ్ఛగా చదును చేసుకుని ఆరుతడి పంటల సాగుకు రంగం సిద్ధం చేసేసుకున్నాడు. కలువాయి చెరువుకు అంతర్భాగమైన ఈ భూమిని పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
పీజీసెట్ షెడ్యూల్లో
స్వల్ప మార్పు
తిరుపతి సిటీ : ఎస్వీయూ ఆధ్వర్యంలో ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్న ఏపీ పీజీసెట్–2025 షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పు చేసినట్లు తెలిసింది. 9వ తేదీన నిర్వహించాల్సిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ పరీక్షను డీఎస్సీ షెడ్యూల్ నేపథ్యంలో 10వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. డీఎస్సీకి హాజరుకానున్న విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.
ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు రూ.54 లక్షల విరాళం
తిరుమల : టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు కర్ణాటకులోని మంగుళూరుకు చెందిన విదా రవిచంద్రన్ అనే భక్తురాలు రూ.54 లక్షలను విరాళంగా అందించారు. మంగళవారం ఈ మేరకు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు.
అల్లిమడుగు కొండపై
గుర్తు తెలియని మృతదేహం
శ్రీకాళహస్తి: పట్టణంలోని తుపాను సెంటర్ పక్కన అల్లిమడుగు కొండపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని కోరారు.

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య