
‘తోతాపురి’ టన్ను రూ.12వేలు
తిరుపతి అర్బన్ :తోతాపురి రకం మామిడిని టన్ను రూ.12వేలకు కొనుగోలు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆయన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కల సి మామిడి గుజ్జు ఫ్యాక్టరీ యజమానులతో సమీక్షించారు. రూ.12వేలకు తగ్గించి కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్యాక్టరీ యజమానుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే రైతులకు అండగా నిలవాలని సూచించారు. తిరుపతి ఉద్యాన శాఖ అధికారి దశరథరామిరెడ్డి, చిత్తూరు ఉద్యానశాఖ అధికారి మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.
గ్రీవెన్స్ అర్జీలకు ప్రాధాన్యత
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ద్వారా వచ్చే అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం కలెక్టరేట్తోపాటు మండల, డివిజన్ స్థాయిలో ప్రజలు అందించే అర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలపై అధికంగా అర్జీలు వస్తున్నాయని వివరించారు. వాటికి పరిష్కారం చూపించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. మరోవైపు పీ–4 కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాండ్, డీపీఓ సుశీలాదేవి పాల్గొన్నారు.

‘తోతాపురి’ టన్ను రూ.12వేలు