
జేఈఈ అడ్వాన్స్డ్లో మెరుపులు
తిరుపతి ఎడ్యుకేషన్ : దేశంలోని ప్రముఖ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఏటా ఎన్టీఏ ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే 18న జాతీయ స్థాయిలో నిర్వహించిన అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో తిరుపతి జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. జిల్లాలోని వివిధ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వంటి కేటగిరిల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఓపెన్ కేటగిరిలో ఎం.భానుచరణ్రెడ్డి జాతీయ స్థాయిలో 51వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 4వ ర్యాంకు సాధించాడు. అలాగే డీ.మణిదీప్రెడ్డి ఓపెన్ కేటగిరిలో 345వ ర్యాంకు, జి.హిమేష్రాఘవ చంద్ర ఓపెన్లో 468, ఓబీఎస్ కేటగిరిలో 61వ ర్యాంకు, ఎం.శశాంక్రెడ్డి ఓపెన్లో 618, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 40వ ర్యాంకు, కె.యశ్విత ఓపెన్లో 906, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 67వ ర్యాంకు సాధించారు. వీరితో పాటు పలువురు విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించారు.
జేఈఈ అడ్వాన్స్డ్లో ‘శ్రీచైతన్య’ విజయకేతనం
తిరుపతి ఎడ్యుకేషన్ : జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో తిరుపతిలోని శ్రీచైతన్య విద్యాసంస్థ విద్యార్థులు జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. సోమవారం ఆ విద్యాసంస్థలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏజీఎం బీవీ.ప్రసాద్ వివరాలను వెల్లడించారు. ఈ ఫలితాల్లో పి.సాయిముకేష్ 115వ ర్యాంకు, ఎం.మునికృష్ణ 228, ఎస్.అశోక్నాయక్ 542, ఎం.భరత్ 847, సి.సహస్త్ర 1202, బీఆర్.కుళ్ళాయప్పనాయక్ 1,335, మోక్షిత్శర్మ 1,371, జ్ఞానసాత్విక్ 1,625, అమూల్య 1,830, కె.అభిరామ్సాయి 2017, గంగా మనోజ్కుమార్ 2,333, ఎ.మణి 2453, జ్ఞానదీక్షిత 3,450, ఎన్.భానుప్రకాష్ 3,992, కె.జీవన్కుమార్ 4,099, కె.కార్తికేయ 4,696, ఎం.కావ్య 4,698, వరుణ్తేజ్ 5,161, ఎస్.హేమంత్చౌదరి 5,189, మణీష్ 5,263, వీరితో పాటు 42 మంది తమ విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆ విద్యాసంస్థ డీన్లు కెఎల్జి.ప్రసాద్, రామమోహన్రావు, శ్రీనివాసరావు, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు అభినందించారు.