
నెత్తిన బరువు పెట్టారు బాబూ!
తిరుపతి: మధ్యాహ్నం వేళ రేషన్ దుకాణం వద్ద క్యూలో వేచి ఉండలేక తమ సంచులను క్యూలో పెట్టిన దృశ్యం
తిరుపతి జిల్లాలో రేషన్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో లబ్ధిదారులు చౌకదుకాణాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈనెల 15వ తేదీ వరకు మాత్రమే రేషన్ అందించనుండడంతో కార్డు దారులు క్యూ కడుతున్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 1,457 రేషన్ దుకాణలు ఉండగా.. వీటిలో 300 దుకాణాల దాకా ఖాళీగా ఉన్నాయి. ఇన్చార్జ్ డీలర్లకు అప్పజెప్పడంతో వారు ఒక గంట రెగ్యులర్ షాపు వద్ద.. మరో గంట ఇన్చార్జ్ షాపు వద్ద సరుకులు ఇవ్వాల్సి వస్తోంది. ఇదిలావుండగా కంది పప్పు, చక్కెర అరకొర ఇస్తుండడంపై కార్డుదారులు మండిపడుతున్నారు. – తిరుపతి అర్బన్

నెత్తిన బరువు పెట్టారు బాబూ!

నెత్తిన బరువు పెట్టారు బాబూ!